గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జూన్ 2024, శుక్రవారం

బ్రహ్మశ్రీ రాచాలపల్లి బాబు దేవిదాస్ రావు ఆత్మకూరు కవి వరులకు తెలంగాణా సారస్వత పరిషత్ అవార్డ్.

జైశ్రీరామ్.

బ్రహ్మశ్రీ రాచాలపల్లి బాబు దేవిదాస్రావు మహోదయులుఆంధ్ర సంస్కృత మరాఠీ భాషలలో అసమాన ప్రతిభులు. అనేక గ్రంథములకు వ్రాసిన గొప్ప కవి. నా శ్రీమన్నారాయణ శతకము వంటి గ్రంథములను అచ్చొత్తించిన మహోన్నత ఉదారగుణసంపన్నులు. అట్టి వీరి ప్రజ్ఞకు తగినట్టులుగా ఇన్నాళ్ళకు తెలంగాణా సారస్వతపరిషత్ అవార్డ్ రావడమనునది సాహిత్య లోకమునకే ఆనందదాయకమైన విషయము.

ఈ మహోన్నత గురుమూర్తికి ఆంధ్రామృతం అభినందనలు తెలియఁజేస్తోంది.

ఆత్మకూరు, జూన్ 27 : తెలుగు సంస్కృతి సాహిత్యంలోని వివిధ ప్రక్రియలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు ఈ ఏడాదికి గాను తెలంగాణ సారస్వత వరిష్ట పురస్కారాలను బుధవారం ప్రక టించింది. అందులో భాగంగా ఆత్మకూరు వాసి, రి టైర్డ్ తెలుగు ఉపాధ్యాయుడు బాబు దేవిదాస్ రావు శ్రీరామాయణో పనిషత్తు పద్య కవిత్వం సా హిత్య రూపంలో రాసినందుకు గాను తెలంగాణ సారస్వత పరిషత్ అవార్డు వరించింది. సంస్కృతి సాహిత్య రంగంలో విశేష కృషిచేస్తున్న ఆయనను ఎంపిక చేయడం గర్వకారణం అని పట్టణ ప్రము ఖులు అంటున్నారు. వీరి పూర్వీకులు మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి ప్రాంతంలో స్థిరపడ్డా రు. కల్వకుర్తి పట్టణంలో పెరిగి పెద్దవాడైన బా బు దేవిదాస్ రావు 1969లో మొదటగా కల్వకుర్తి లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1970నుంచి సాహి త్య రచన ప్రా రంభించి ప ద్య, గద్య, వచనములలో, తెలుగు సంస్కృతం, మరాఠి, హిందీ మొదలగుభాషల్లో రచనలు చేసి ఉభయ రాష్ట్రాల్లో అనేక సత్కారాలు, సన్మానాలు పొందారు.
• ఆత్మకూరులో స్థిర నివాసం రాచాలపల్లి బాబు దేవిదాస్రావు ఉద్యోగ రీత్యా ఆత్మకూరు సంస్థానం చేరినా ఆయన ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరి మాతృభాష మ రాఠీ. అయినా తెలుగుభాషా పండితుడిగా, కవిగా
పేరుగాంచారు. అంతేకాకుండా వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో ఉపాధ్యా య వృత్తిని కొనసాగించి 1986లో ఉత్తమ ఉపా ధ్యాయుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఎందరి నో విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు చేర్చిన వారిలో ప్రముఖుడు. వేద శాస్త్ర రక్షణ పరిషత్తు ఉమ్మడి పాలమూరు జిల్లా కార్యదర్శిగా ఉండి 16 సభలు ఆత్మకూరు పట్టణంలోనే నిర్వహించి ఎందరో కవులకు ఆదర్శప్రాయుడ య్యారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులకు ప్రతీయేటా తెలంగాణ సారస్వత పరిషత్ వరిష్ట పురస్కారాలు అందిస్తోంది. అందు లో భాగంగా ఈ సంవత్సరం మన ఆత్మకూరు పట్టణవాసి ఎంపికైనందుకు గాను పట్టణ ప్రముఖులు, విద్యావేత్తలు, కవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరిన్ని సాహిత్య కళా సంపుటిలను అందించాలని ఆత్మకూరు పట్టణ ప్రముఖులు కోరుతున్నారు.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.