గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జూన్ 2024, శుక్రవారం

శిష్యుడు గురువుకు వేసిన ప్రశ్న.... చెప్పుకోంది చూద్దాం.

జైశ్రీరామ్.
ప్రశ్నలతో కూడిన శ్లోకం
సముద్యతే కుత్ర న యాతి పాంశులా?
సముద్యతే కుత్ర భయం భవేజ్జలాత్?
సముద్యతే కుత్ర తవా పయాత్యరి?
ప్రహేణ సంబోధన వాచికం పదం
నిబంధనలు..
మొదటి ప్రశ్నకు సమాధానం నాలుగు అక్షరాలు ఉండాలి, అందులోని మూడు అక్షరాలు రెండవ ప్రశ్నకు, అందులోని రెండక్షరాలు మూడవ ప్రశ్నకు, ఆఖరి అక్షరం నాలుగవ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

ప్రశ్న అర్థం- జవాబులు
*1 వ ప్రశ్న:
* ఎవరు ఉదయిస్తే వ్యభిచారులు తిరగడం మానేస్తారు? 
సమాధానం *'హిమకరః'* అంటే (చంద్రుడు), ఈ శ్లోకంలోని ప్రశ్నలన్నీ సతి సప్తమిలో వున్నాయి. కనుక సమాధానాలు కూడా సతి సప్తమిలోనే ఉండాలి. కనుక సమాధానం 'హిమకరే'*

*2వ ప్రశ్న:
* ఏ జంతువు నీటినుండి బయటకు వస్తే భయం కలుగుతుంది? 
మొసళ్ళు సమాధానం సంస్కృతంలో మొసలిని "మకరః'* అంటారు. సతి సప్తమి కనుక *"మకరే* సమాధానం.

*3వ ప్రశ్న:
* నీవు ఏది ఎత్తితే నీ శత్రువులు పారిపోతారు?
 *'కరః'* అంటే చేయి. సతి సప్తమి కనుక
*"కరే* నీవు చేయి ఎత్తితే శత్రువులు పారిపోతారు.

*నాల్గవ ప్రశ్న:* హీన కర్మల నాచరించే వాడిని యేమని పిలుస్తారు? 
*'ఒరే'* అని పిలుస్తారు. దీన్ని సంస్కృతములో *"రే'' అంటారు. *"రే'* అని నాల్గవ సమాధానం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.