గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మే 2014, శనివారం

16 వ లోక్ సభ ఏర్పడుతున్న సందర్భముగా యావత్ భారత జాతికీ అభినందనలు.

జైశ్రీరామ్.
మన భారత దేశమున16 వ లోక్ సభ ఏర్పడుతున్న సందర్భముగా  యావత్ భారత జాతికీ అభినందనలు.
పరమ శాంత స్వభావులైన మన భారతీయులు ముప్పదేండ్లుగా తమ తల వ్రాతలు మార్చి తమకు కనీస జీవన సౌందర్యాన్నందించగల ప్రతినిధులుగా భావించి తమ ప్రతినిధులను ఎంపిక చేసి పంపి, చివరకు  తమ ఆశలు నిరాశే కావడంతో తమ భవిత బాగుండడం కొఱకు పునరాలోచించుకొని మార్పు చేసి తమ తీర్పునిచ్చారు.
మన భారత జాతి ఇప్పుడు భారత జాతిని పూల బాటలో నడిపించ వలసిన బృహత్తర బాధ్యతను భారతీయ జనతా పార్టీ తలపై పెట్టింది.
నాకు నమ్మకముంది. శ్రీమాన్ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడబోతున్న పదునారవ లోక్ సభ తప్పక ఈ పంచవర్ష ప్రళాళికలో  భారతీయుల ఆశలను నెరవేరుస్తుంది.
ఎంతో సంయమనం పాటించుతూ,  సమయం వచ్చినప్పుడు నేర్పుగా సత్తా చాటుతూ, తాము వేస్తున్న ఓటులో తమ కలలను నిక్షిప్తం చేస్తూ పాలకులను నిర్దేశిస్తుంది.
ఇప్పుడు మాత్రం ఓటరు సామాన్యుడు కాడు మహా మేధావి అని తమ ఓటు ద్వారా నిరూపిస్తాడని నిరూపితమైంది.
ఈ నూతన ప్రభుత్వాన్ని భరత మాత సేవకై నిర్దేశించిన మన జాతి యావత్తుకు నేను హృదయ పూర్వకముగా అభినందన పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
శ్రీమాన్ నరేంద్ర మోడీ అతి సామాన్య కుటుంబీకుఁడు, తనకష్టంతో, మేధా సంపత్తితో, నిస్వార్థంతో, అంచలంచలుగా ఎదిగి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండి, భారత జాతి అభ్యున్నతి సాధన కొఱకు తన సమయాన్ని, మేధా సంపత్తిని వెచ్చించడానికి సంసిద్ధుడైనందుననే జాతి యావత్తు వారికి పట్టం కట్టింది.
ఈ మహనీయునికి అనుచరులైన ప్రజాప్రతినిధులు తమ పరిపూర్ణమైన హృదయ పూర్వకమైన సహకారం అందిస్తూ,  మోడీ శరీర భాగాలవలె ఉండి, భరతమాత కడగండ్లు తీర్చడంలో తమ వంతు కృషిని తాము చేస్తారని కొండంత ఆశతో జాతి ఎదురు చూస్తోంది.
ఎన్నికయిన ప్రజా ప్రతినిథులందరికీ నా హృదయ పూర్వక అభినందనలు.
ప్రజా ప్రతినిధులారా! మీ మేధస్సు నుపయోగించకపోయినా పరవాలేదు. మన మోడీగారి అడుగుజాడలలో మీరు నడవ గలిగితే చాలు. ఈ పేద ప్రజా ప్రతినిధియైన మన నరేంద్ర మోడీ ప్రజల ఆశలను నెరవేర్చ గలడు. కాన మీరు వారికి సహకరించడం ద్వారా మీకు ప్రజలు అందచేసిన విజయాన్ని సార్థకం చేసుకోండి.
దయ చేసి ఎటువంటి స్వార్థానికి లోను కావద్దు.
అందరికీ నా అభినందన పూర్వక నమస్సులు.
ఇట్లు
మీ తోటి భారతీయుఁడు.
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.