గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, మే 2014, బుధవారం

సర్వేంద్రియోపశాంత్యా చ , తుష్యత్యాశు జనార్దనఃమేలిమి బంగారం మన సంస్కృతి, 202.

జైశ్రీరామ్.
శ్లో. దయయా సర్వభూతేషు , సంతుష్ట్యా యేనకేన వా 
సర్వేంద్రియోపశాంత్యా చ , తుష్యత్యాశు జనార్దనః

గీ. సకలజీవులఁ దయఁజూచి సంతసముగ 
తా జితేంద్రియుండై యుండి దర్పము విడి
జీవనము సేయు నెవ్వండు వానితోడ
దైవముండును నిరతము.దేవుఁడతఁడు.
భావము.అన్ని జీవులయందు దయ కలిగి ఉండటం, ఉన్న దానితో సంతృప్తి చెందటం, ఇంద్రియ నిగ్రహం అనే సుగుణాలు కలవారికి దైవం వెంటనే ప్రసన్నుడౌతాడు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.