గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, నవంబర్ 2008, శనివారం

పోతన భాగవత కథా క్రమము. దశమ { 10 వ } స్కంధము ఉత్తర భాగము.

సహజ పాండిత్య బిరుదాంకితుడగు పోతన మహాకవి విరచిత భాగవతమునందలి దశమ { 10 వ } స్కంధమునందలి ఉత్తర భాగ కథా క్రమమును తెలుసుకొందామా ఇప్పుడు? ఐతే చూడండి.

దశమ { 10 వ } స్కంధము నందలి కథా క్రమము.
ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము.
రతీదేవి ప్రద్యుమ్న సహితయై గగన మార్గంబున ద్వారకకు బోవుట.
శ్రీ కృష్ణుండు లోకాపవాడ నివృత్తి కొఱకు స్యమంతక మణిన్ దెచ్చుట.
శతధన్వుడు సత్రాజితుని జంపి మణినపహరించుట.
శ్రీ కృష్ణుండింద్రప్రస్థ పురంబునకరుగుట.
శ్రీ కృష్ణుండు కాళిందీ మిత్రవింద నాగ్నగితి భద్ర లక్షణల బరిణయం బగుట.
శ్రీ కృష్ణుడు సత్యభామతో గూడ నరిగి నరకాసురుని వధించుట.
సత్యభామ నరకాసురునితో యుద్ధంబు సేయుట.
భూదేవి శ్రీ కృష్ణుని స్తుతించుట.
శ్రీ కృష్ణుడు పదాఱు వేల కన్నియల వరించి దేవ లోకమునకు బోయి పారిజాతము తెచ్చుట.
శ్రీ కృష్ణుండు కేళీ గృహమునందు రుక్మిణీ దేవితో విరసోక్తులాడుట.
రుక్మిణీ దేవి శ్రీ కృష్ణ లాలితయై యతని స్తుతించుట.
శ్రీ కృష్ణుండు రుక్మిణీ దేవి నూఱడించుట.
బాణాసురుండీశ్వర ప్రసాదంబు నొందుట.
బాణాసురుండనిరుద్ధుని నాగ పాశ బద్ధుని జేయుట.
నారదుని వలన ననిరుద్ధుని వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట.
బాణాసురుని సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుద్ధమగుట.
బాణాసురుండు రెండవ సారి యుద్ధమునకు వచ్చుట.
శివుడు బాణుని రక్షింప శ్రీ కృష్ణుని స్తుతించుట.
ఉషానిరుద్ధ సహితుండై కృష్ణుండు ద్వారకాపురంబున కరుగుట.
నృగ మహారాజు చరిత్రము.
బలరాముడు సుహృద్బంధుజన దర్శనార్థమై వ్రేపల్లెకు బోవుట.
శ్రీ కృష్ణుండు పౌండ్రకవాసుదేవుని మీద దండెత్తిపోయి వానిని జంపుట.
బలరాముండు ద్వివిదుడను వానరుని సమ్హరించుట.
బలరాముండు హస్తినా పురమును గంగలో ద్రోయ బూనుట.
షోడశ సహస్ర స్త్రీ సంగతుండైన శ్రీ కృష్ణుని మహిమ నారదుండరయుట.
నారదుండు శ్రీ కృష్ణునితో ధర్మరాజు రాజసూయము నెరవేర్పుమని సెప్పుట.
శ్రీ కృష్ణుండుద్ధవుని యాలోచన చొప్పున ధర్మరాజు పాలికి పోవుట.
పాండవులు శ్రీ కృష్ణుని తోడ్కొని పోవుట.
ధర్మరాజు శ్రీ కృష్ణు ననుమతంబున భీమాదుల దిగ్విజయంబునకు బంపుట.
శ్రీ కృష్ణ భీమార్జునులు జరాసంధుని వధింప బోవుట.
శ్రీ కృష్ణ సహాయుందగు భీముండు జారాసంధునితో యుద్ధము సేయుట.
కారా గృహ విముక్తులగు రాజులు శ్రీ కృష్ణుని స్తుతించుట.
ధర్మరాజు చేసేడి రాజసూయంబు నందు శ్రీ కృష్ణుండు శిశుపాలుని వధించుట.
సాల్వుండు శివ ప్రసాదంబున సౌభక విమానంబు వడసి ద్వారకా పురిపై దండెత్తుట.
శ్రీ కృష్ణుండు దంతవక్త్రుని సమ్హరించుట.
బలరాముండు తీర్థ యాత్రకు జనుట.
కుచేలోపాఖ్యానము.
శ్రీ కృష్ణుండు సకుటుంబముగ గ్రహణ స్నానమునకు బోవుట.
లక్షణ యను శ్రీ కృష్నుని యష్టమ భార్య ద్రౌపదీదేవికి తన వివాహ వృత్తంతము దెలుపుట.
నారదాది మహర్షులు స్రీ కృష్ణ దర్శనంబు సేసికొని వసుదేవునిచే క్రతువు చేయించుట.
శ్రీ కృష్న బలభద్రులు మృతులైన తన సహోదరుల దెచ్చి దేవకీదేవికి కనబఱచుట. సుభద్రా పరిణయము.
స్రీ కృష్ణుండు ఋషి సమేతుండయి మిథిలా నగరమునకు బోవుట.
శ్రుతిగీతలు.
పరీక్షిత్తునకు శుకయోగి విష్ణు సేవా ప్రాశస్త్యము సెప్పుట.
శివ ద్రోహంబు సేయంబూనిన వృకాసురుండు విష్ణు మాయచే మడియుట.
భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్త్యము శోధించుటకు బోవుట.
శ్రీకృష్ణుండు మృతులైన విప్ర సుతులను దెచ్చుట.
దశమ { 10 వ } స్కంధము ఉత్తర భాగము సమాప్తము.

మిగిలిన రెండు స్కంధములలోని కథా క్రమమును త్వరలో మీముందుంచగలను.
జైహింద్. Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

sri krishnuni motham khadanu vivaramra rayandi

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.