గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, నవంబర్ 2008, గురువారం

పోతన భాగవత కథా క్రమము. చతుర్థ { నాల్గవ } పంచమ {ఐదవ } స్కంధములు

ఇంత వరకు పోతన భాగవతములోని తృతీయ స్కంధము వరకు కథాక్రమాన్ని మనం తెలుసుకొన్నాం కదా1 ఇప్పుడు చతుర్థ , పంచమ స్కంధముల లోని కథా క్రమాన్ని చూద్దామా మరి ?

పోతన భాగవతం లోని చతుర్థ { నాల్గవ } స్కంధములోని కథా క్రమము.
కర్దమ ప్రజాపతి సంతతి వివరణము.
దక్ష ప్రజాపతి సంతతి వివరణము.
ఈశ్వరునకు దక్ష ప్రజాపతికి విరోధము సంభవించుట.
దాక్షాయణి దక్ష ప్రజాపతి యజ్ఞమునకు పోవ గోరుట.
శివుడు వీరభద్రునిచే దక్ష యజ్ఞము ధ్వంసంబు సేయించుట.
దేవతలు వీరభద్రాదులచే పరాజితులై, బ్రహ్మకు విన్నవించుట.
బ్రహ్మాదులు దక్షిణామూర్తి నీశ్వరుని స్తుతించిట.
శివుడు బ్రహ్మాదులచే ప్రార్థితుడై, దక్షాదులననుగ్రహించుట.
దక్షాధ్వరమునకు వచ్చిన నారాయణుని దక్షాదులు స్తుతించుట.
ధ్రువోపాఖ్యానము.
ధ్రువుడు నారదోపదేశము పొంది తపంబు సేయుట.
సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుడు స్తుతించుట.
ధ్రువుండు మరల తన పురంబునకు వచ్చుట.
ధ్రువుడు కుబేరానుచరులైన గుహ్యకులతో యుద్ధము సేయుట.
అంగ పుత్రుడగు వేనుని చరిత్ర.
పృథు చక్రవర్తి గోరూపిణి యగు భూమి వలన నోషధుల బితుకుట.
పృథు చక్రవర్తి యశ్వమేధమున నింద్రు డశ్వము నపహరించుట.
నారాయణుడు పృథు చక్రవర్తి ననుగ్రహించుట.
పృథు చక్రవర్తికి సభా సదులకు సద్ధర్మముల నుపదేశించి, బ్రాహ్మణ ప్రశంస సేయుట.
పృథు చక్రవర్తి యొద్దకు సనకాదు లరుగుదెంచుట.
జ్ఞాన వైరాగ్యవంతుడైన పృథు చక్రవర్తి ముక్తి నొందుట.
రుద్రుండు ప్రచేతసులకు యోగాదేశమను స్తోత్రమును దెల్పుట.
నారదుడు ప్రాచీనబర్హికి జ్ఞాన మార్గమును దెల్పుట.
పురంజనోపాఖ్యానము.
ప్రచేతసుల తపమునకు మెచ్చి భగవంతుడు వరము లిచ్చుట.
చతుర్థ { నాల్గవ } స్కంధము సమాప్తము.

పంచమ { ఐదవ } స్కంధము. ప్రథమాశ్వాసము లోని కథాక్రమము.
ప్రియవ్రతుని చరిత్ర.
భగవంతుడగు నారాయణుడు ఋషభావతార మెత్తుట.
ఋషభుడు పుత్రులకు నీతి యుపదేశించుట.
భరతోపాఖ్యానము.
భరతుడు హరిణ జన్మము విడిచి బ్రాహ్మణుడై జనించుట.
వృషల రాజ భృత్యులు భరతుని కాళీ బలికి గొనిపోవుట.
భరతుడు రహూగణుని మాటలకు బ్రత్యుత్తరములిచ్చుట.
పంచమ స్కంధము లోని ప్రథమాశ్వాసము సమాప్తము.

పంచమ { ఐదవ } స్కంధము ద్వితీయాశ్వాసములోని కథా క్రమము.
ఉపదేశ రూపమున శుకయోగి దెల్పు భూగోళ నిర్ణయము.
భగణ విషయము.
శుకయోగి పరీక్షిత్తునకు దెలిపిన నరక లోక వర్ణన.
పంచమ స్కంధములోని ద్వితీయాశ్వాసము సమాప్తము.

పరమ భాగవతోత్తములకు ప్రీతి కరమగునని నే చేయుచున్న ఈ ప్రయత్నమున దొసగులు పొసవిన సహృదయతతో మన్నించి సరి చూచుకొన వలసినదిగా మనవి చేయుచున్నాను. సమయము భగవంతుడు కల్పించినప్పుడు మిగిలిన విషయమును మీ ముందుంచగలవాడను.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.