గురజాడ వేంకట అప్పారావు
21-9-1862 -నుండి-30-11-1915
సీ:-ఆంధ్రామృతము గ్రోలనాసక్తి తో నున్న
అంధ్రులార! సుగుణ సాంద్రులార!
భువి సర్వసిద్ధిరాయవరము గ్రామాన
మాతామహులయింట మానితముగ
ప్రఖ్యాతమైనట్టి పద్ధెందివందల
యరువదిరెండులో నాంధ్రులలర
స్థిరముగ సెప్టెంబ రిరువ దొకటి నాడు
ప్రజల కవి గురజాడ జనియించె.
గీ:-ప్రజల భాషకు సాహితీ ప్రతిభ గొలిపె.
సంఘ సంస్కర్తగా పేరు సంతరించె.
మనము గురజాడ పుట్టిన దినమునాడు
గేయ కవితలనంజలి చేయ దగును.
Print this post
మాదయ్యగారి మల్లన.
-
మాదయ్యగారి మల్లన.16వ శతాబ్దం.శైవబ్రాహ్మణుఁడు.గురువు.కడపజిల్లా పుష్పగిరికి
చెందిన అఘోర శివాచార్యులు.
రాజశేఖర చరిత్ర.3ఆశ్వాసాలు. 516గద్యపద్యాలు. నాదెండ్ల అ...
4 రోజుల క్రితం
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.