గురజాడ వేంకట అప్పారావు
21-9-1862 -నుండి-30-11-1915
సీ:-ఆంధ్రామృతము గ్రోలనాసక్తి తో నున్న
అంధ్రులార! సుగుణ సాంద్రులార!
భువి సర్వసిద్ధిరాయవరము గ్రామాన
మాతామహులయింట మానితముగ
ప్రఖ్యాతమైనట్టి పద్ధెందివందల
యరువదిరెండులో నాంధ్రులలర
స్థిరముగ సెప్టెంబ రిరువ దొకటి నాడు
ప్రజల కవి గురజాడ జనియించె.
గీ:-ప్రజల భాషకు సాహితీ ప్రతిభ గొలిపె.
సంఘ సంస్కర్తగా పేరు సంతరించె.
మనము గురజాడ పుట్టిన దినమునాడు
గేయ కవితలనంజలి చేయ దగును.
Print this post
8, సెప్టెంబర్ 2008, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.