జైశ్రీరామ్.
శ్లో. గావః పశ్యంతి గంధేన - వేదైః పశ్యంతి పండితాః!
చారైః పశ్యంతి రాజానః - చక్షుభ్యాం ఇతరే జనాః!
తే.గీ. గంధచక్షువులన్ బశుల్ కనుచునుండు,
వేదచక్షులన్ గాంతురు వేదవిదులు
చారు చక్షులన్ బాలకుల్ చక్క గాంత్రు,
చర్మ చక్షువులన్ గాంత్రు సకలజనులు.
భావము
గోవులు వాసనా నేత్రము చేతను, పండితులు వేదవిజ్ఞానమనే నేత్రము చేతను,
రాజులు చారులనెడి (గూఢచారులు) నేత్రములతోడను, తమకు
కావలసిన విషయములను చూచుచుండగా, సాధారణజనులు
చర్మచక్షువులతోనే చూడగలుగుచున్నారు.
జైహింద్.
Print this post
వ్రాసినది
Labels:












2 comments:
అద్బుతం, అద్బుతం సత్యం నిజం.
సంతోషం అజ్ఞాతగారూ!
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.