ప్రియ పాఠకులకు, యావత్ భరతీయ సహోదర సహోదరీ మణులకు భారత దేశ గణతంత్ర దినోత్సవ శుభా కాంక్షలు.
మన భరత మాత పాడి పం టలతో సమస్త శుభప్రద వనరులతో వర్ధిల్లుతూ, యావత్ భారతీయులకు ఆయు రారోగ్య ఆనంద ఐశ్వర్యాలకు మూలమై విరాజిల్లేలా చేయాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను.
ఉత్పలమాల:-
భారత మాత సద్వినుత. భాగ్య నిధానముగా స్థిరంబుకాన్,
శ్రీ రమణీయమై సతము శ్రేయము గూర్చెడి కల్పవల్లిగాన్ ,
ధారుణి నగ్ర దేశముగ, తప్పక వర్ధిల జేయుమయ్య! యీ
ధారుణి నున్న మానవులు ధర్మప్రవరుల జేయు మీశ్వరా!
జైహింద్.
Print this post
శీమతి డా. మలయవాసిని గారికి అభినందనలు. అనేక కంద గీత గర్భ చంపక మాల.
-
జైశ్రీరామ్.
శ్రీమతి డా. మలయవాసిని గారికి జగన్మాత ఆశీస్సులు.
అనేక కంద గీత గర్భ చంపక మాల.
👇🏼
వర గుణదాంబరో! మలయ వాసిని! మీకు నమస్కరింతు, శ్రీ
కర ప్రణవ...
2 వారాల క్రితం
వ్రాసినది












0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.