గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జనవరి 2009, సోమవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 51.

మన పెద్దలు ఏం చెప్పినా మన మంచిని కోరే చెప్పుదురు. అవి పాటించినట్లయితే మనకు మేలు జరుగుతుంది.
ఈ క్రింది శ్లోకంలో ఒక చక్కని నగ్న సత్యాన్ని చెప్పారు. చూద్దాం.

శ్లో:-
మహానదీ ప్రతరణం
మహా పురుష నిగ్రహం
మహా జన విరోధంచ
దూరతః పరి వర్జయేత్.

తే:-
ఆదరువు లేక నది దాట నమరు ముప్పు.
అధికు లకుభిన్నముగనుమాటాడరాదు.
పూన రాదు విరోధము జ్ఞానులయెడ.
నాశనంబగు వినకున్న నాదు మాట.

భావము:-
మహా ప్రవాహములను నిరాధారుడై దాట యత్నించ రాదు. మహా పురుషులతో నిగ్రహించి మాటలాడరాదు. మహాత్ములతో విరొధము పూన రాదు. ఇవి వినాశకరములు సుమా.

మనసుని అదుపులో పెట్టుకోవడానికి యిటువంటి శ్లోకాల్ని, పద్యాల్ని మనం మననం చేస్తూ వుంటే మన జీవన గమనం ఒడుదొడుకులు లేకుండా, అవాంఛిత అనార్థాలకు గురి కాకుండా జీవించ వచ్చునేమో మీరూ ఆలోచించండి.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.