గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, డిసెంబర్ 2021, సోమవారం

తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ ||1-13|| // తతః శ్వేతైర్హయైర్యుక్తే ||1-13|| అర్జున విషాద యోగము

 జైశ్రీరామ్

శ్లో.  తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |

సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్ ||1-13||                                                          

తే.గీ.  శంఖముల్ భేరులే గాక సమరమునకు

సిద్ధమని దెల్ప పణవముల్, చెలగిమ్రోగె

గోముఖంబులు,తప్పెటల్, కూడి మ్రోగ

వినగ గజిబిజిగాఁ దోచె, విశ్వమునను.

భావము.                                                                                                                                    ఆ

వెంటనే శంఖాలూ, భేరులూ, పణవాలూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ,

మద్దెలలు)గోముఖాలు ఓకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది.


శ్లో.  తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ |

మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః ||1-14||

కం.  శ్వేతాశ్వరథముపై వి

ఖ్యాతిగ హరియును కిరీటి యలరుచు శంఖం

బాతత గతిఁ బూరించిరి,

జ్ణాతంబవ సైనికులకు జయనాదముగా.

భావము.                                                                                                                                   

అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు

దివ్యశంఖాలను ఊదారు. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.