గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, సెప్టెంబర్ 2020, శనివారం

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.
ఆర్యులారా! నేడు డా.సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి వీరి జన్మదినమును ఉపాద్యాయదినముగా వీరు ఉపాధ్యాయులుగా చేసిన సేవల వలన గుర్తింపబడింది.
వీరికి  అంజలి ఘటిస్తూ
ఉపాద్యాయులందరికీ నా శుభాకాంక్షలు తెలియఁ జేయుచున్నాను.
మన మనసుకు బోధను గొలిపే పెఅరీ వ్యక్తీ మనకు గురువేనని మనము మరువ రాదు. సద్గురువులు నిత్య పూజనీయులు
అట్టి వారికి సంవత్సర కాలములో నొక్కసారయినా మనము స్మరించుకొని వారికి మనము అభినందనలు మనలో వారిపైగల ప్రేమను తెలుపుట మానవధర్మము.

ఏ మహనీయు లిద్ధర గణించు విధంబగు బోధ గొల్పిరో
యా మహనీయులందరికినంచిత భక్తి నమస్కరించెదన్.
భూమిని సత్ప్రవర్తనను పుణ్యముగొల్పెడి సత్యమార్గమున్
క్షేమము గొల్ప చేసిన ప్రసిద్ధులు నీ గురుదేవులెన్నగన్.

గురుదేవులకు ప్రణమిల్లుతూ
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.