గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జనవరి 2019, మంగళవారం

జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.

కేవలం శాస్త్రపండితులకు కవిత్వం మీద గౌరవంవుండదు. శాస్త్రంచదివి పూర్వపక్ష సిద్ధాంతాలుచేసి ప్రతిపక్షుల ముఖపిదానం చేయడమే  వారిపరమార్థం - లోలోపల సంస్కృత పండితులలోనే శాస్త్రపండితులకూ కవులకూ రావరవలు వున్నాయి
"ఘట: పట ఇతి స్ఫుటం పటురటంతి నైయాయికాః
పఠన్తిచ హాఠాత్తరాం కఫ ఛటేతి పాతంజలా :
వయంవకుళ మంజరీ గళదరీణ మాధ్వీఝరీ
ధురీణ శుభరీతిభిః ఫణితిభిః ప్రమోదామహే
తర్కవ్యాకరణపండితులు రసజ్ఞులుకారు. శుష్క తర్క వితర్క వాచాలురు. కవులు మధుమయ ఫణుతులతో వినోదిస్తారు.
నైవవ్యాకరణాజ్ఞ మేవ పితరం నభ్రాతరం తార్కికం
దురాత్సంకుచితైవ గచ్ఛతి యథా చండాలవ చ్ఛాన్ద సాత్
మీమాంసా నిపుణం నపుంసక మితి జ్ఞాత్వా నిరస్యాదరాత్
కావ్యాలంకారణజ్ఞ మేవ కవితా కన్యా వృణేతే స్వయమ్
కవితాకన్యకు తండ్రివంటివాడు వైయాకరణుడు , సోదరుడు తార్కికుడు ; శ్రోత్రియుడు అంటరానివాడు ; మీమాంసకుడు నపుంసకుడు. వారెవ్వరూ వరించదగ్గవారుకారు. ఇక కావ్యాలంకారవేత్తయైన రసజ్ఞుడే వరణీయుడు - అని కవులు శాస్త్రపండితులను ఈసడించారు.
విద్వత్కవయః కవయ : కేవలం కవయస్తు కేవలం కపయ :పాండిత్యం తో చెప్పినవారే కవులు. వట్టి కవులు వట్టి కపులు - అనిపండితులు తిరస్కరించారు.
మొత్తం మీదచేస్తే కవులకు శాస్త్రపాండిత్యమవసరమే. కాని దానికి కొమ్ములిస్తే మాత్రం అది కవిత్వాన్ని పట్టి పల్లార్చడం నిజం
రెండింటి సరస సమ్మిశ్రణ మే ఉత్తమ కవితామార్గం.
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మంచి విషయాలను తెలిపి నందులకు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.