గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జనవరి 2019, ఆదివారం

పుణ్యాహ వాచనమ్ ఎందుకు. బ్రహ్మశ్రీ అందుకూరి చిన పున్నయ్య శాస్రి.

                                  జై శ్రీరామ్ 
పుణ్యాహ వాచనమ్ ఎందుకు. బ్రహ్మశ్రీ అందుకూరి చిన  పున్నయ్య శాస్రి.   

ఈ పుణ్యాహవాచనం అనే మాటను వ్యవహారంలో అనేక రకాలు గా పలకటం మనం వింటూ ఉంటాము .. పుణ్యాహవచనమని .... పుణ్య వచనమని .{గజేంద్ర మోక్షం లాగా ... అసలు మాట గజేంద్ర మోక్షణం )కనుక మనము ఈ పదము యొక్క అసలు స్వరూపము -దాని ప్రయోజనము తెలుసుకుంటే ఆనందంగా ఉంటుంది . "జ్ఞాత్వా కర్మాణి కుర్వీత ".  అన్నారు.అంటే అర్థం తెలుసుకుని కర్మలు చెస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది అని పరమార్థం .
ఇది తెలుసుకోబోయేముందు తెలుసుకోవాల్సింది   ఏమిటంటే ప్రపంచం లో ఏ జ్యోతిష శాస్త్రం లో లేని ఆచారం మన వైదిక జీవనం లో ఉన్నది. ఏమిటంటే మనిషి పుట్టిన నక్షత్రం కనుక్కుని ,ఇక జీవితంలో ఆతను ఏదైవ  కార్యం  చేసినా జ్యోతిష శాస్త్ర ప్రకారం కాలామృ తాది
గ్రంధాల  సహాయం తో దైవ కార్యం చేసే ముహూర్తం నక్షత్ర ప్రాధాన్యం గా నిర్ణ యిస్తారు. అంటే ఫలాని నక్షత్రం లో దేవ కర్మ చేయాలి .ఫలాని నక్షత్రంలో గృ హ్య కర్మ చేయాలి అని  నిర్ణ యిస్తారు. దీనికి కారణమూ ప్రమాణమూ ఏమిటంటే

తైత్తిరీయ బ్రాహ్మణం ,మొదటిభాగం, 5వ ప్రపాఠకం ,2 వ అనువాకం లో ఈ విషయం చెప్పబడినది.

ఆ మంత్రం ఇది.
"సలిలం వా ఇదమంతరాసీత్. యదతరన్  తత్తారకాణామ్ తారకత్వం . యో వా ఇహ యజతే . అ ముంస  లోకం నక్షతే . తన్నక్షత్రాణాం  నక్షత్రత్వం .దేవ గృ హా వై నక్షత్రాణి .య ఎవంవేద గృహ్యై వ భవతి. .
అర్థం: ద్యులోక పృ థివీ లోకముల మధ్యలో ఉండే స్థావర జంగమాత్మక మైన ఈ దృ శ్యమాన సృ ష్టి స్థానంలో పూర్వం ప్రళయ కాలంలో నీరు మాత్రమే ఉండేది . అ ప్పుడు కృ త్తికాది నక్షత్రాలు ఆ నీటిని దాటుకుని లోకాన్తరాలకు వెళ్లి నయ్యి .నీటిని దాటుకుని వేళ్లి నయ్యి కనుక (తరించినయ్యికనుక) వాటిని తారకలు అన్నారు. ఏ యజమానుడైతే (యజ్ఞం చే సేవాడు) ఈ నక్షత్ర యుక్తమైన కాలం లో యజ్ఞం చేస్తాడో ఆ యజమానుడు స్వర్గలో కాన్ని పొందుతాడు. అందుకని వాటిని నక్షత్రాలు అన్నారు. (ఇది 'నక్ష' శబ్దం మీదనుండి వచ్చింది. నక్ష అంటే గతి లేక గమనము అని అర్థము. )నక్షత్ర సహాయం తో స్వర్గ గమనము సాధిస్తాడు కనుక వాటిని నక్షత్రాలు అన్నారు.
ఈ నక్షత్రాలు దేవతా గృ హ సదృశాలు . మనుష్యులు ఎవిధంగానయితే
గృహంలో దీప ప్రకాశము తో వ్యవ హరిస్తారో అదే విధంగా దేవతలు నక్షత్ర ప్రకాశ సహాయం తో వ్యవహరిస్తారు. అందు వలన నక్షత్రాలు ప్రశస్తములు .ఇది తెలిసిన యజమానికి చాలా గృహాలు గానీ ,మంచి ప్రశస్త గృ హాలు కానీ కలుగుతయ్యి.

కనుక ఇప్పుడు మనం చేసే ప్రతికర్మకు నక్షత్రం కుదిరిందో లేదో చూసుకోవటం ఎందుకో ఇప్పుడు అర్థమయ్యింది కదా!. ఇక పుణ్యము అనేమాట ఎట్లా వచ్చిందో చూద్దాము.
సామానమయిన రోజుని (అంటే సరిగ్గా 60 ఘడియలు లేక 24 గంటలను అయిదు భాగాలుగా చేసారు,.
వాటికి క్రమంగా ప్రాతః ,సంగవ, మధ్యాహ్న ,అపరాహ్ణ ,సాయం కాలాలని పేరు పెట్టారు.ఈ ఐదు విభాగాలు పుణ్యమైనవి. దాని వలన ఆ రోజు పుణ్యమైన రోజు అవుతుందని తైత్తిరీయ బ్రహ్మణం చెబుతున్నది. కారణం
ప్రాతః కాలం లో సత్యాను ష్ఠాన పరులు వారి పనులు మొదలు పెడతారు.
సంగవకాలం లోఆవులు అరణ్యానికి వెళ్లి సంచరిస్తయ్యట
మధ్యాహ్నం లో సూర్యుడు తేజస్సుగా ఉంటాడు    .ఋషులు వేదాన్ని ప్రబలంగా అధ్యయనం చే స్తారు.
అపరాహ్ణం లో తల్లులు కుమార్తెలకు సౌభాగ్య సూచకమైన అంగ ప్రక్షాళన , ధమ్మిల్ల బంధన, న యనాంజనాది కర్మలు చేస్తారు (కళ్ళకు కాటుక దిద్దటం)
సాయం కాలం ...ఇది వరుణుడికి సంబంధించినది కాబట్టి సాయంత్రం సమయం లో అబద్ధం ఆడకూడదు , అబద్ధం చేయ కూడదు.

ఈ ప్రకారంగా ఆ సమయాలు ఏ విధముగా పుణ్యములో చెప్పారు.ఇక ఈ ఐదు సమయాలలో ఏ నక్షత్రాలు ఉంటె ,ఆ రోజు పుణ్యమైన రోజు అని అంటారో చెప్పుకుందాము. వేదంలో పరాయతము అనే భాగం లో ఈ విషయం చెప్పారుట .
ప్రాతః కాలం : హస్తా నక్షత్రం
సంగవ కాలం :అనురాధా నక్షత్రం
మధ్యాహ్నం : పుష్యమి
అపరాహ్ణమ్ :ఉత్తర ఫల్గుణి
సాయం కాలం : శతబిషమ్
ఈ సమయం లో ఈ నక్షత్రాలు ఉంటే , ఆ రోజు మొత్తము పుణ్యమైన రోజని , ఆ  రోజున దేవకర్మలు , గృహ్య కర్మలు(పెళ్లి,ఉపనయనం లాంటివి) చెయ్యొచ్చని  చెప్పారు. అయితే ఒక విశేషము విధించారు. (షరతు లేక కండిషన్ )ఇది ఉత్తరాయణం లో శుక్ల పక్షములో అయితే మాత్రమె పుణ్యమైన రోజులు అని కరాఖండి గా చెప్పారు.
చిక్కంతా ఇక్కడే వచ్చిన్ది.  
అంటే దీని లక్షణాలు ఎమిటి .
రోజుకి సరిగ్గా 24 గంటలే ఉండాలి .(ఎక్కువ గాని, తక్కువ గాని ఉండగూడదు.).ఉత్తరాయణమ్ లో అయి ఉండాలి . శుక్ల పక్షం అయిఉండాలి . ఈ అయిదు సమయాలలో పైన చెప్పిన నక్షత్రాలు ఉండాలి. లేకపోతె దేవతా సంబంధమైన కర్మలు చెయగూడదు.
ఉత్తరాయణం లో అంటే ఆరు నెలలలో శుక్లపక్షం 3 నెలలు ఉంటుంది . అందులో ఈ నక్షత్రాలు కలిగిన విశేష సమయాలు ఎన్ని ఉంటయ్యి. ... ఈ మూడు నెలలలోనే అన్ని శుభకార్యాలు చేయటం సాధ్యమా !

ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి . మన వైదిక కర్మలన్నీ గృహ్య సూత్రాలమీద ఆధార పడి  ఉంటయ్యి . మన వైదిక విధానం లో మనం చేయాల్సిన విధుల కోసంమహానుభావులు చాలామంది గృ హ్య  సూత్రాలు వ్రాశారు. ఆపస్తంబుడు ,ఆశ్వలాయనుడు మొదలైన వారు . గృ హ్య సూత్రాలంటే మన గృహాలలో చేసే దేవతా పూజలు అని చెప్పవచ్చు. అవి... జాత కర్మ , నామకరణం , చౌలొపనయనమ్ ,ఉపనయనం ,సమావర్తనం(స్నాతకం)  ,వివాహం మొదలైనవి.
ఇప్పుడు మ నం చూస్తున్న వైదిక క్రియలన్నీ , ముఖ్యంగా ఉపనయన వివాహాలు ,ఆపస్తంబ సూత్రాలను అనుసరించి చెస్తున్నవే . అయితే ఆ అపస్తంబుడు ఒక చిక్కు తెచ్చిపెట్టాడు .
"సర్వ ఋ తవో వివాహస్య " (2-12)అనే ఒక సూత్రం చెప్పాడు . అంటే సంవత్సరం పొడుగునా వివాహం చేయవచ్చు అని. (ఒక్క శిశిర ఋతువు,ఆషాఢ మాసం వదిలి ) అంటే దక్షిణాయనంలో కూడా చేయ వచ్చనే గదా అర్థం . మరి
"ఉదగయన పూర్వ పక్షాహః పుణ్యా హేషు కర్మాణి " అని 2 వ సూత్రం ఆపస్తంబుడే చెప్పాడు . అంటే దేవసంబంధమైన కర్మలు అన్నికూడా ఉత్తరాయణం లోను ,శుక్ల పక్షపు పుణ్య నక్షత్రములతొ కూడి చేయదగినవి అని .. మరి ఎట్లాగు .....
దానికి ఋ షులే ఒక మార్గం కనిపెట్టారు . అదేమిటంటే బ్రాహ్మణు డు 27నక్షత్రాల తరువాత 28 వ నక్షత్రం లాంటివాడు . అలాగే పుణ్య నక్షత్రాలు కలిగిన రోజులు మొత్తం 12 ఉంటె అందులో 12 వవాడు బ్రాహ్మణుడు . అ తను వచ్చి ఇవ్వాళ పుణ్యమైనా రోజు మీరు కర్మలు చేయవచ్చు అని చెబితే ఆ రోజుకి కర్మ యోగ్యతా వచ్చి శుభ కాల విశేషము అవుతున్ది. బ్రాహ్మణం ప్రకారం "యథా నక్షత్ర యోగాత్ కాలస్య కర్మ యోగ్యతైవం బ్రాహ్మణ వచనాదపి కాలః కర్మయోగో   భవతి. "  అంటే నక్షత్ర యోగము వలన కాలం కర్మ యోగ్యతకలిగినది గా అవుతుందో , అదేవిధం గా బ్రాహ్మణ వచనం వలన కుడా కలం కర్మయోగ్యతను పొందుతుంది . "అని దీని అర్థం ,.
ఈ పన్నెండు పుణ్యాహము లేమిటో చూద్దాము .సమమైన రోజును ఐదు భాగములు చేస్తే వచ్చే ఐదు సమయ విశేషాలు .పుణ్య  నక్షత్రాలతో కూడి నవి. ఆ తరువాత ఐదు సమయాల సంధు లలో అనగా
ప్రాతః-సంగవ,సంగవ-మధ్యాహ్న ,మధ్యాహ్న -అపరాహ్ణ ,అపరాణ్హ -సాయంకాల వచ్చే రెండు ముహూర్తాలు (ముహూర్తం అంటే 2 ఘడి యలు. )ఉదాహరణ కి ప్రాతః కాలం లో ని మూడు ముహుర్తాలలో చివరిది, దాని తరువాత ఉన్న సంగవ కాలం లోని మూడు ముహుర్తాలలో మొదటి ముహూర్తం కలిపి ఒక పుణ్య నక్షత్రం . ఇప్పుడు మొత్తం తొమ్మిది అయినయ్యి. ఇక ఉషః కాలము  , ప్రదోష కాలము ఇవి రెండు పుణ్య నక్షత్రాలు. మొత్తం పదకొండు అయినయ్యి.
ఇక బ్రాహ్మణుడు 12 వ పుణ్య నక్షత్రం . అందుకని జ్యోతిష్య శాస్త్ర రీత్యా జన్మ నక్షత్రాన్ని అనుసరించి ,క్రతువు చేయటానికి పుణ్యమైనరోజు నిర్ణయించినా అది ఉత్తరాయణం లో ఉన్నా లేకపోయినా బ్రాహ్మణుడిచేత పుణ్యాహ వాచనం చేయిస్తే (అంటే ఇవ్వాళ పుణ్యమైనరోజు అని చెప్పిస్తే )అది పుణ్యాహం లో చేసినట్టే అని ఋషులు చెప్పారు.
అందుకే బ్రాహ్మణుడు వచ్చి విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి .. మిగతా పూజ అంతా చేసి ..చివరికి
"పున్యాహంమితి భవంతో బ్రువన్తు "అంటాడు . అప్పుడు సభలో ఉన్న పెద్దలు , ముఖ్యం గా వేద విప్రులు పుణ్యాహం పుణ్యాహం పుఅ అని వేదం ణ్యాహం అ
ని మూడుసార్లు అంటారుట . కారణం ఏమిటంటే త్రిషత్యాహి  వై దేవాః " అని శా స్త్రమ్.ఏదైనా  మూడు సార్లు ఎబితేనే దేవతలు నమ్ముతారట . మరి దేవతలు నమ్మి మనకు సహాయం చేయాలిగదా .
ఇక సభలో ఉన్న వారు అనటం దేనికంటే .. వైదిక కర్మలె ప్పుడూ  సభలోనే చేయలిట  .. ఆఖరికి సంధ్యా  వందనం కూడా .. అందుకే చివరకు భో అని ప్రవర చెప్పుకుంటాము. '
సభా అనేది బ్రాహ్మణుడికి పశు సంపద అని వేదం చెబుతున్నది .

ఇదీ పుణ్యాహ వాచనం యొక్క అర్థం.
పైన చెప్పిన కారణాల కోసం పుణ్యాహ వాచనం చేయించాలి .
మంగళం 
అందుకూరి చిన  పున్నయ్య శాస్రి.
జై హింద్ 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పౌణ్యాహ వచనం యొక్క విశేషములను గురించి ఎన్నో తెలియని విషయములను చక్కగా వివరించిన బ్రమ్మ శ్రీ అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి గారికి శత వందనములు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.