గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ఉగ్రవాదుల దురాగతానికి బలైపోయినవారికి,క్షతగాత్రులకు నా ప్రగాఢ సానుభూతి.

సోదరీ సోదరులారా!
హైదరాబాదులో మనందరితో పాటు సహ జీవనం చేస్తూ 
ఆత్మీయతలను పంచుకొంటూ కూడా 
దురదృష్ట వశాత్తు 
టెఱ్ఱరిష్టుల చేతిలో కీలుబొమ్మలైపోయినవారి 
దురాగతానికి బలైపోయిన 
మన తోటివారి ఆత్మలకు శాంతి చేకూరాలని మనసారా కోరుకొంటున్నాను. 
క్షతగాత్రులు ఆ పరమాత్మ దయకు పాతృలై వేగముగా కోలుకోవాలని ఆశిస్తూ 
వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేయుచున్నాను.
ఓం అసతోమా సద్గమయ! 
తమసోమా జ్యోతిర్ గమయ. 
మృత్యోర్మా అమృతం గమయ. 
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః.
Print this post

1 comments:

తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

ఉగ్రవాదమనుచు దనుజులుండగ దండింప ప్రభుత
ఉగ్రరూపము దాల్చదేల? ఊరపందుల దునుమాడ
అగ్రరాజ్యపు (నీ)రీతి గనుమ! అసహాయులన్ రక్షజేయ
ఉగ్ర నృసింహ సిపాయి లొక్కపెట్టున మట్టుబెట్ట.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.