గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఫిబ్రవరి 2019, మంగళవారం

శుద్ధనిరోష్ట్య కందము. శ్రీ కాశీ సత్యవధానులు.

జైశ్రీరామ్.
శుద్ధనిరోష్ట్య కందము. శ్రీ కాశీ సత్యవధానులు.  

అలికాంచి తా శ్రాయాశా
ఖల దైత్యానీక నాశ కలితాంత్యాశా
లలితాంత రిక్ష కేశా
సలిల జనయ నేశ యీశ శశి నీకాశా

టీక:---నాలిక= నొసటి యందున, అంచిత= ఒప్పుచుండిన, ఆశ్రయాశా=అగ్నిహోత్రుడు గలవాడా, ఖల= దుర్మార్గులగు,దైత్యానీక =రాక్షస సైన్యముల, నాశ= హతము చేసినవాడా, కలిత=ఒప్పుచున్న, అంత్య= చివరిదియగు
ఆశా =దిక్కు గలవాడా,(ఈశాన్య మూల యనుట)లలిత-మనోజ్ఞమైన,
అంతరిక్ష= ఆకాశమునే, కేశా=వెంట్రుకలుకల వాడా, సలీలజ నయన =కమలాక్షుడగు
విష్ణునకు,ఈశ= ఈశ నామము గలవాడా, శశి= చంద్రుని వంటి, నీకాశా=కాంతి గలవాడా.
ఈ పద్యం పెదవులకు తగలకుండా చదవడానికి వీఎలుగా రచింప బడినది. అందుచేత
దీనిని 'శుద్ధ నిరోష్ట్యం' అంటారు.
జైహింద్.
Print this post

1 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

గురుదేవులకు శుభోదయ వందనములు
అవధానుల ప్రతిభకు పాదాభివందనములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.