గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఫిబ్రవరి 2017, మంగళవారం

మాతృభాషా దినోత్సవము సందర్భముగా అందరికీ నా శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.

ఆర్యులారా!. నేడు ఫిబ్రవరి 21వ తేదీ. మాతృభాషా దినోత్సవము.
ఈ సందర్భముగా అందరికీ నా శుభాకాంక్షలు.
మాతృ దేవత - మాతృ భూమి - మాతృ భాష అత్యున్నత స్థాయిలో గౌరవింపబడాలి. 
అటువంటి గౌరవాన్ని మనం ఇచ్చి, మన ఔన్నత్యాన్ని ప్రకటించుకోవాలి.
మాతృ దేవి మిన్న మాతృభూమియు మిన్న 
మాతృభాష మిన్న మరువకయ్య.
మాతృ దేవిఁ గొల్చి. మాతృభూమిని నిల్చి 
మాతృభాష ఘనత మహిని నిలుపు.
శుభాకాంక్షలతో
మీ
రామకృష్ణారావు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మాతృ భాషా దినోత్సవ సందర్భముగా మాతృ భూమికీ మాతృమూర్తికీ పాదాభి వందనములు .అందరికీ శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.