గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, అక్టోబర్ 2014, ఆదివారం

కూపస్తటాక ముద్యానం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. కూపస్తటాక ముద్యానం, మండపం చ ప్రపా తథా
జలదాన మన్నదానం, అశ్వత్థారోపణం తథా
పుత్రశ్చేతి చ సంతానం, సప్తవేదవిదో వీదుః.
గీ. నూయి, యుద్యానము, చెరువు, స్వీయ సుతుఁడు, 
మండపము, చలివేంద్రమ్ము మహిత రావి
సప్త సంతతు లొకటున్న చాలు మనకు
ముక్తిఁ గొలుపును గాంచుడు పూజ్యులార!
భావము. నూయి, చెరువు, ఉద్యానవనం, మండపం, చలివెంద్రము, ఆశ్వత్థారోపణం, పుత్రుడు, అనే ఈ ఏడును సప్తసంతానములని వేదవేత్తలు చెప్తున్నారు.
పుత్రుడు పితృ కర్మలద్వారా నరకం నుండి ఉద్ధరించి స్వర్గాన్ని కలుగచేస్తాడని విశ్వాసం. వాడది సవ్యంగా చెయ్యకపోతే... అంతే వాడిని కని తెచ్చిపెట్టుకొన్న నరకం ఏదైతే వుందో, అది మనకి అక్కడా తప్పనట్లే. మిగిలిన ఆరు ఆయా ప్రదేశాలలో మనపేరు చిరస్థాయిగా ఉండేట్లు చేస్తాయి. మన పేరు ఎంతకాలం వినపడితే అంతకాలం స్వర్గలోక వాసం అని ధర్మశాస్త్రాదులు చెప్పుచున్నవి. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.