గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జులై 2010, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 99.

మృత్యువు అమృతము మనలోనే ఉంటాయి.
See full size image
శ్లోll
అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం
మృత్యురాపద్యతే మోహాత్ సత్యేనాపద్యతేzమృతం.
తే.గీll
నిత్యమమృ తము మృత్యువు నిశ్చితముగ
దేహమున నుండు దేహికి. దేహికుండు
మోహమునమృత్యువబ్బును.మోహి కాక
సత్యదర్శికి యమృతంబు సంభవించు.
భావము:-
అమృతము మృత్యువు అనే రెండూ దేహమునందే కలవు. మోహము కారణముగా మృత్యువును సత్య దర్శనము కారణముగా అమృతమును మానవులు పొంద గలరు.
జైహింద్. Print this post

2 comments:

సురేష్ బాబు చెప్పారు...

బాగా చెప్పారు. ఈ శ్లోకం ఎందులోనిదండి?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పుటపర్తి సాయి బాబా మనకి ప్రత్యక్ష దైవము ఆస్వామిని నమ్మినవారికి కొంగు బంగారమె స్వామి చిత్రాన్ని ఉంచి మంచి పని చేసావ్ .స్వామి అభయ హస్తం మనకి కొండంత అండ .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.