శ్లోll
సతాం ధనం సాధుభిరేవ భుజ్యతే;
దురాత్మభిర్దుశ్చరితాత్మనాం ధనం
శుకాదయః చూతఫలాని భుంజతే.
భవంతి నింబాః ఖలు కాక భోజనాః.
తే.గీll
మంచిగలవారి సంపద మంచి వారి;
చెడ్డ గలవారి సంపద చెడ్డ వారి;
యనుభవంబగు. చిలుకకు నమర ఫలము
కాకికిని నింబ ఫలమును; గలుగు తినగ.
భావము:
మంచి వారి సంపదలు మంచి వారికే అనుభవానికి వస్తాయి. దురాత్ముల ధనములు దుష్ట చరిత్రులకే వినియోగ పడుతాయి. మామిడి పండ్లు చిలుకలకే భుక్తం అవతాయి. వేప పండ్లు కాకులకే భుక్తం అవతాయి. ఇది లోకంలో జరుగుతున్నదే కదా!
మనము మంచి మార్గమున సంపాదించిన సొమ్ము అనుభవించే మన వారు కూడా మంచివారు గానే తీర్చి దిద్దఁ బడుదురు. చెడ్డ మార్గమున సంపాదించిన మన ధనము ననుభవించు మన కుటుంబీకులు చెడ్డగనే దిద్దఁ బడుదురు. కావున ఋజు మార్గముననే సంపాదించాలని మనము మరువ రాదు.
జైహింద్.
Print this post
సౌందర్యలహరి 46-50పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం
శ్రీమతి వల్లూరి సరస్వతి.
-
జైశ్రీరామ్.
46 వ శ్లోకము.
లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవ యత్
ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ |
విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః ...
10 గంటల క్రితం
1 comments:
నిజమె మంచి మార్గ ముననే సంపాదించాలి ఏ పనినైన ఋజు మార్గముననే చేయాలి కానీ ఈ రోజుల్లో ఎందరున్నారు ? కాకపోతే మంచిని బోధించటం విజ్ఞుల ఔన్నత్యం.వినడం వినకపోవడం వారి వారి ఖర్మం [ బుద్ధీ ఖర్మాను సారిణీ ]అన్నారు కదా ?
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.