గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, అక్టోబర్ 2008, శుక్రవారం

కళా పీఠం లో కార్యక్రమం.వక్త డా.యన్.రాజేశ్వరి.

శ్రీ అన్న మాచార్య సంగీత పీఠం, చోడవరం లో ప్రతీ నెలా ఆఖరి ఆదివారం జరుపుకొనే సాహితీ కార్యక్రమం కవితా వైశిష్యం కార్యక్రమం ఈ నెల 26-10-2008 వ తేదీ ఆది వారం నాడు జరుప బడును. ఈ కార్యక్రమానికిముఖ్య అతిథిగా విశాఖపట్టణ నివాసి అయిన డాక్టర్ యన్. రాజేశ్వరీ శంకరన్ గారు వచ్చి, పాల్కురికి సోమ నాథుడు అనే కవిని గూర్చి ఉపన్యసించబోతున్నారని పీఠం అధ్యక్షులు శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మిగారు ప్రకటించారు.
శ్రీమతి డాక్టర్ యన్.రాజేశ్వరి గారు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ద్వారా " పోతన - అతని సాహితీ శిల్పం " అనే అంశంపై పరిశోధనా గ్రంథం వ్రాశి డాక్టరేటు పొందారు.తెలుగు దిపార్టుమెంట్ లో మొట్టమొదటగా డాక్టరేట్ సాధించిన మహిళామణి యీమెయే. మరో ప్రత్యేకత యేమిటంటే ఆ పరిశోధనా వ్యాసానికి బంగారు పథకం కూడా వచ్చింది.
ప్రస్తుతం వీరి వయసు 80 సంవత్సరాలుంటాయి. ఈమె ఆంధ్ర యూనివర్సిటీలో బీయే ఆనర్స్ చేసి రిసిపిఎంటాఫ్ శ్రీమతి ఈశ్వరీదేవి సహానీ మెమోరియల్ ప్రైజ్ సాధించారు.
అలంకార శాస్త్రంలో ఎమ్మే ఆనర్స్ చేశారు. డెక్కన్ పీజీ కాలేజ్ పూనే ద్వారా డిప్లమో యిన్ లింగుఇస్టిక్ సాధించారు.
తెలుగు విజ్ఞాన సర్వస్వానికి కల్చరల్ వాల్యూం కు రచన లందించారు.
ఈమె 6 గ్రంధాలు వ్రాయడమే కాక అత్యున్నత ప్రమాణాలు గల తెలుగు పత్రికలద్వారా పెక్కు వ్యాసాలను సమాజానికందించారు.
నేషనల్ ఎండ్ ఇంటర్ నేషనల్ ఫొక్ లోర్ అనే గ్రంథాన్ని ప్రచురించారు. నేషనల్ బుక్ ట్రష్టాఫ్ యిండియా సంస్త కొరకు 2 ఆంగ్ల గ్రంథాలను తెలుగు లోనికి అనువదించారు.
ఒరిస్సా ఉత్కళ యూనివర్సిటీలో తెలుగు డిపార్టుమెంట్ హెడ్డు గా 6 సంవత్సరాలు పనిచేశారు.
ఢిల్లీ యూనివర్సిటీ కి సంబంధిచిన వెంకటేశ్వరా కాలేజ్ లో ప్రొఫెసర్ గా 8 సంవత్సరాలు పనిచేశారు.
జమ్మూకాశ్మీర్లో రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్గా 6 సంవత్సరాలు పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున జె.కె.లోని మారుమూల ప్రాంతాలలో అనేక సేవా కార్య క్రమాలు చేశారు.
ఒరిస్సా పబ్లిక్సర్వీస్ కమిషన్ మరియు ఎడ్మినిష్టేటివ్ సర్వీసెస్లో 12 సంవత్సరాలు పని చేశారు.
పాండుచ్చేరి శ్రీ అరబిందో సొసైటీ వ్రైటర్స్ క్లబ్ మెంబర్ గా పని చేశారు.
ఇంతటి బహు ముఖ ప్రజ్ఞా శాలి అయిన వీరి ఉపన్యాసం విని తీరవలసిందే. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.