గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఫిబ్రవరి 2019, బుధవారం

అన్నీ యేత్వాలు గల పద్యం కాశీ పత్యవధానులు గారి రచన

జైశ్రీరామ్
అన్నీ యేత్వాలు గల పద్యం   కాశీ పత్యవధానులు గారి రచన
కేలే దే తేతేలే
వే లేవే మెట్లె దేబేవే యెల్చేడె
న్నే లేనే వేరే యె
గ్గే లేనే లేదే యేడ్చే దేవే మేలే

టీక:- కేలు= హస్తం, యేదే=ఎచ్చటనే, తేతేవే =తెమ్ము తెమ్ము, లే= శీఘ్రముగా
లేవే మెట్లే =లేవలేమి యెట్లనే, దేబేవే = దీనురాలవా, ఏల్చేడెన్= రక్షించు వనితను,
నేలేనే=నేనుండ లేదా, వేరే= వేరుగా, ఎగ్గే లేనే లేదే =కీడు,లేక దోషము లేనే లేదే
ఏడ్చేదేవే=యేడ్చెదవెందుకే, మేలే =శుభమే లే.
ఈ పద్యమంతా ఎత్వాలతో రచింప బడింది.(అచ్చ తెలుగులో)
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా బాగుంది. పండితుల వారికి ప్రణామములు . మా కందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.