గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జులై 2009, శుక్రవారం

ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు

పౌష్టికాహారం తీసుకోవాలి. మీ పిల్లలకు పరివారానికి పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్య వంతమైన జీవితాన్ని గడపండి అని ప్రభుత్వము, వైద్యులు నిత్యం సెలవిస్తూ వుంటారు. ఐతే ఆహార సంపాదనే చాలా కష్టంగ వుంటే ఇక పౌష్టికాహారం ఎలా తీసుకో గలం? అత్యవసరమైన బియ్యం కనీసం ఖరీదు ౩౦ రూపాయలు. కాగా ఇక మిగిలిన సంభారాలు మేమేం తక్కువ కాదన్నట్టు విపరీతమైన వెలలతో మధ్య తరగతి కుటింబీకులకు సహితం అందుబాటులో లేకుండా పోయాయంటే ఇక సామాన్యుని జీవనం గడిచే దెలాగ?

ఎక్కడుంది లోపం? ఎవరిలో ఉంది ఈ దోషం? నిజంగా సరకు లేకపోతే మనం బాధ పడ్డా అర్థముంది. కాని డబ్బు కోరినంత యిస్తే మనం కోరినంత దినుసు లభ్యమౌతోందే!

అన్ని విధాలా పకట్బందీగా పరిపాలనా యంత్రాంగాన్ని నిర్మించుకోగలిగిన మనం ఎక్కడ చేతకానివారిమై భవిష్యత్తును ప్రస్తుతాన్ని అంధకార బంధురం చేసుకొంటున్నాం?

కమ్యూనిష్టులు ప్రతిఘటనను చేస్తున్నారు. ఒక్క పిసరైనా ప్రయోజనం చేకూరే అవకాశం కలిగిందా? ఎందరు తమ నిరసనను తెలియజేస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ఎన్నాళ్ళని ఈ సామాన్యులు తమ జీవన నౌకను నడప గలరు?

ఎన్నాళ్ళని మనం మౌన జీవనం సాగించ గలుగుతాం?
మనం ఎదుర్కొంటున్న ఈ గడ్డు సమస్యలను, సామాజిక దృష్టితో ఆలోచించి, మన బ్లాగుల ద్వారా ప్రభుత్వ దృష్టికి వెళ్ళేలాగ మన అభిప్రాయాల్ని వ్రాయగలిగితే మన వంతు కర్తవ్యాన్ని చేయడంలో మనం నిర్లిప్తంగా లేమనే ఆత్మానందం మనకు మిగలడమే కాక ఒక్కొక్కరి రచన ప్రభుత్వానికి కను విప్పు కలిగించే అవకాశం లేకపో లేదనీ నా నమ్మకం. మరి మన అభిప్రాయాల్ని రచనలద్వారా మన బ్లాగులలో నిక్షిప్తం చేసి, మనం చేయ గలిగినంత మనం చేస్తే బాగుంటుందని మనవి.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.