గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, అక్టోబర్ 2025, బుధవారం

కార్తికదీపము వెలిగించి పఠించవలసిన శ్లోకము.

జైశ్రీరామ్. 

ఓం శ్రీమాత్రే నమః.

కార్తికదీపము వెలిగించి పఠించవలసిన శ్లోకము.


శ్లో.  కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాఃI

జలే స్థలే యే నివసన్తి జీవాఃII

దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినఃI

భవంతి త్వం శ్వపచాహి విప్రాః II


భావము.

దీపము వెలిగించినప్పుడు ఆ దీపపు కాంతిని చూసిన కీటకాలు, పక్షులు, దోమలు, వృక్షాలు, మరియు నీటిలో, భూమిపై నివసించే జీవులు అన్నీ కూడా తమ పాపాలను పోఁగొట్టుకొని ముక్తిని పొందును అని భావము. ఈ శ్లోకాన్ని దీపము వెలిగించినప్పుడు పఠించుట ద్వారా, ఆ వెలుగును చూసే ప్రతి జీవికి శుభము కలుగవలెనని ఆకాంక్షించవలెను.


అమ్మ దయతో

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.