గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మార్చి 2015, శుక్రవారం

సప్తస్వర కందము. శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కృతము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల నరసింహమూర్తి కవి కృత సప్తస్వర కందమును తిలకించండి.
ఇందు కేవలము  స, రి, గ, మ, ప, ధ, ని,   అను సప్త స్వరములు మాత్రమే వాడబడినవని గమనించగలరు.
సప్తస్వర కందము:-
సరిసరి నీసరి సరిగమ
సరిరా గమపదనిస సరి సారధి గనుమా
మురరిపు గురుపద, మగసరి
సరి, సిరిపరమున్-గిరిధరు, సరసపు మగనిన్
భావము:- రసవత్తర ప్రభుడు, గిరిధరుడు, లక్ష్మీదేవి యొక్క పరముడునగు, శ్రీమహావిష్ణువునకు సరిగా గమియించు వాడుగాని, సారధ్యము వహించువాడు గాని, ఆ మగసరియగు మురరిపుడు,గిరిధరుడు మాత్రమే. అనగా తనకు తానే సాటి; వేరొకరు తనకి సరిపడరని భావము. సరిగమపదని-యను సప్త స్వరములను తీసికొని వ్రాయబడినది.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
శ్రీ వల్లభవఝుల వారి కృతము వర్ణింప నావంటి అల్పులకు సాధ్యమేనా ? " సప్తస్వరముల కంద మకరందము " గ్రోలి తరించ వలసినదే మరి .చాలా బాగుంది అసలిలా వ్రాయ వచ్చునను ఊహకూడా తెలియని దానను .చదవ గలగడం నా అదృష్టం ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.