గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, మార్చి 2015, గురువారం

సప్తాక్షర కందము. శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కృతము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల నరసింహమూర్తి కవి కృత సప్తాక్షర కందమును తిలకించండి.
ఇందు కేవలము  గ, జ, త, మ, య, వ, శ అను అక్షరములు వాడబడినవని గమనించగలరు.
కం. మాయా మయ జగమయ శివ
మా "యగజ" - విజయ,జయమతి మముగావంగా,
తీయగ వశమై, జవమై
మాయుతి, గతియై, మతియయి - మావశమగుతన్.
భావము:- ఓ పరమేశ్వరా! శివా! ఇది మాయామయ జగత్తు. మా తల్లియగు పార్వతమ్మ విజయ జయయగుచు మము రక్షింపగా,మధురముగా వశమై, మాశక్తి, యుతి, గతి, మతియగుచు మావశమగునుగాక! "అమ్మ కరుణ అనంతము"
జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.