గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఫిబ్రవరి 2010, శనివారం

ప్రథమ పూజ్యులు బ్రహ్మ- వ్యాస - వాల్మీకిలు.

శ్లోll
ఏకో z భూన్నలినా త్పరస్తు పులినా ద్వల్మీకత శ్చాపరః
తే సర్వే కవయస్త్రిలోక గురవ స్తేభ్యో నమస్కుర్మహేll  ( ఉద్భటుఁడు ) 
భావముll
కమలమునను, పులినమునను, వల్మీకమునను, పుట్టినవారే అపూర్వ కవులు.
పరమాత్మ కళయై, యమృత రూపిణి యైన వాణిని చిర తపః ఫలముగా దర్శించి, ఆమె దివ్య స్వరూపమును లోకమున కెఱిగించిన వారు వారే. కావున వాణి కంటెను ఆ కవులే వందనీయులు. ఆ సరస్వతి లోకమున ప్రకాశింప తనంత తానే బ్రహ్మ నలు మొగముల నుండి నాలుగు రూపములతో వెలువడినది. ఆ కారణముగా  బ్రహ్మ ప్రథమ కవి యైనాడు. అష్టాదశ పురాణములను, భారతమును మిత్ర సమ్మితములుగా వెలువరించిన వ్యాసుడును, రామాయణమును కాంతాసమ్మితముగా వెలువరించిన వాల్మీకియు పూజ్యులైనారు.  ఈ మువ్వురి కారణముగ ప్రసిద్ధమై, లోకమును కాపాడే వేద సరస్వతీ మాత జ్ఞానదేవత. ఆమెకు నమస్కరించుటకు పూర్వము మూలమైనవారగు బ్రహ్మ,వ్యాస, వాల్మీకి లు పూజనీయులు.అట్టి వారికి నమస్కారము.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.