గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఫిబ్రవరి 2016, ఆదివారం

రధసప్తమి వ్రత ప్రయోగము.

జైశ్రీరామ్.
రధసప్తమి వ్రతము. 
ధ్యానం:
శ్లో: ధ్యేయ స్సదా సవిత్రుమండల మధ్యవర్తీ ; నారాయణ స్సర సిజాసన సన్నివిష్టమ్
కేయూర వాన్మకర కుండల వాన్కిరీ టీ ; హరీ హిరణ్మయ పుర్ధ్రత శ్మంఖ చక్రః
శ్లో: నమస్సవిత్రే జగదేక చక్షుషే ; జగత్ప్రసూతి స్థితినాశ హేతవే
త్రయీ మయాయ త్రిగుణాత్మ ధారిణే ; విరించి నారాయణ శంకరాత్మనే, ప్రాణ ప్రతిష్టాపనం కుర్యాత్
ఓం రవివారాది దైవత్యం భాస్కరం విశ్వరూపిణమ్,ఓం హ్రాం మిత్రాయ నమః ధ్యాయామి.
ఓం శ్రీసూర్యాయ నమః ధ్యాయామి - ధ్యానం సర్పయామి.
ఆవాహనం :
శ్లో: రక్తాబ్జ యుగ్మాష భయదానహస్తం కేయూర హారాన్గద కుండలాడ్యం
మాణిక్య మౌళీందిననాడామేడే బంధూక కాంతిం విలసత్రినేత్రం.
ఓం శ్రీసూర్యాయ నమః ఆవాహయామి. ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి.
ఆసనం :
శ్లో || దివాకర నమస్తుభ్యం సర్వలోకైక నాయక, దివ్య సింహాసనం దేవ స్వీకురుష్వ రవి ప్రభో.
ఓం శ్రీసూర్యాయ నమః నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనం సమర్పయామి||
పాద్యం:
శ్లో || గ్రహరాజ నమస్తుభ్యం పాద్యంగంధాది భిర్యుతం, స్వచ్చం పాద్యం మయాదత్తం సంగృహాణ దివాకర.
ఓం సూర్యాయ నమః పాదయో పాద్యం సమర్పయామి||
అర్ఘ్యం :
శ్లో: గంగాజలం సమానీతం రక్త పుష్యాది భిర్యుతం, అర్ఘ్యం గృహాణ భగవన్ మార్తాండాయ నమోనమః.
ఓం సూర్యాయ నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి.
ఆచమనీయం :
శ్లో: పద్మపత్ర జగచ్చక్షుః పద్మాసన సమప్రభ, ప్రద్యోతన పవిత్రంచ దదామ్యాచ మనం కురు.
ఓం సూర్యాయ నమః ఆచమనీయం సమర్పయామి.
అర్ఘ్యం:
శ్లో; ఏహిసూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే, అనుకంప్య మయాభక్త్యా గ్రుహార్ఘ్యం నమోస్తుతే.
ఓం శ్రీసూర్యాయ నమః అర్ఘ్యం సమర్పయామి.

మధుపర్కం :
శ్లో: మధ్వాజ్య దధి సంయుక్తం శర్కరాక్షీ ర సంయుతం, మధుపర్కం గృహాణేదం మయాతుభ్యం సమర్పిత మ్.
ఓం శ్రీ సూర్యాయ నమః మధుపర్కం సమర్పయామి.
పంచామృత స్నానం :
శ్లో: పంచామృతేన స్నపనం భాస్కర స్య కరో మ్య హ మ్, నశ్యంతు పంచపాపాని సూర్యదేవ ప్రసాదత.
ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమవ్రుష్ణ్య మ్భ, భవా వాజస్య సంగథే. (పాలు)
ఓం దధి క్రావ్ణో అకారి షం జిష్ణోర శ్వ స్య వాజినః సురభి నో ముఖా కరత్ప్ర ణ ఆయోగ్గ్ షి తారి షత్. (పెరుగు)
ఓం శుక్రమసి, జ్యోతిరసి, తెజోసి దేవోవస్వితాత్పునః, త్వచ్చిద్రేనా పవిత్రేనా వసో సూర్యస్య రశ్మిభి. (నెయ్యి)
ఓం మధువాతా ఋతాయతే మధుక్ష రన్తి సివ్దవః మాద్వీర్న స్సన్త్వో షధీః,
మధునక్త ముతో మధుమత్పార్థి వగ్గ్ రజః మధుద్యౌ రన్తు నః పితా
మధుమాన్నో వన స్పతిర్మధుమాం అస్తు సూర్యః మాధ్వి ర్గావో భవస్తు వః. (తేనే)
ఓం స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహావేతునామ్నే,
స్వాదుమిత్రాయ వరునాయ వాయవే, బృహస్పతయే మధుమాగుం అదాభ్యః (పంచదార)
ఓం శ్రీ సూర్యాయ నమః పంచామృత స్నానం సమర్పయామి.
శుద్దోదక స్నానం :
శ్లో: గంగాజలం సమానీతం గంధ కర్పూర సంయుతం స్నాపయామిత్రి లోకేశ గృహ్యతాం వైదివాకర
ఓం శ్రీ సూర్యాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి.
వస్త్రయుగ్మం:
శ్లో: దివాకర నమస్తుభ్యం పాపం నాశయ భాస్కర రక్త వస్త్ర మిదం దేవ ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్
ఓం సూర్యాయ నమః వస్త్ర యుగ్మం సమర్పయామి.
యజ్ఞోపవీతం :
శ్లో: అహః పతే నమస్తుభ్యం తీ క్ ష్ణాం శు పతయే నమః ఉపవీతం మయాదత్తం సంగృహాణ దివాకర.
ఓం శ్రీసూర్యాయ నమః ఉపవీతం సమర్పయామి.
గంధం:
శ్లో: గోరోచన సమాయుక్తం క స్తూర్యాది సమన్వితం, గంధం దాస్యామి దేవేశ సంగృహాణ దివాకర.
ఓం శ్రీసూర్యాయ నమః గంధాన్ సమర్పయామి.
అక్షతాన్:
శ్లో: అక్షతాన్ దేవదేవేశ రక్త గంధ సమన్వితా న్ గృహాణ సర్వలోకేశ మయాదత్తాన్ సురేశ్వర.
ఓం శ్రీసూర్యాయ నమః అక్షతాన్ సమర్పయామి.

సర్వాభరణాని :
శ్లో: రక్త మాణిక్య సంయుక్తం భూషణాని విశేషతః మాయాదత్తాని గృహ్ణీ ష్వ పద్మ గర్భ సముద్యతే.
శ్రీ సూర్యాయ నమః సర్వాభరణం సమర్పయామి.
పుష్ప సమర్పణ :
శ్లో: రక్త వర్ణాని పుష్పాణి పద్మాని వివిధాని చ, మల్లికాదీని పుష్పాణి గృహాణ సుర పూజిత.
ఓం శ్రీ సూర్యాయ నమః పుష్పాణి సమర్పయామి.
అథాంగ పూజ:
ఓం శ్రీ సూర్యాయ నమః పాదౌ పూజయామి
ఓం శ్రీ దివాకరాయ నమః జంఘే పూజయామి
ఓం శ్రీ ప్రభాకరాయ నమః జానుయుగ్మం పూజయామి
ఓం శ్రీ భాస్కరాయ నమః ఊరూ పూజయామి
ఓం శ్రీ జగన్నాథాయ నమః కటిం పూజయామి
ఓం శ్రీ త్రయీమయాయ నమః నాభిం పూజయామి
ఓం శ్రీ ఆదిత్యాయ నమః కుక్షిం పూజయామి
ఓం శ్రీ ద్యమణయే నమః వక్ష స్థలం పూజయామి
ఓం శ్రీ సుబాహవే నమః బాహూ పూజయామి
ఓం శ్రీ రవయే నమః పార్స్వౌ పూజయామి
ఓం శ్రీ జ్యోతిషాంపతయే నమః భుజా పూజయామి
ఓం శ్రీ త్ర్యైలోక్యాయ నమః కంటం పూజయామి
ఓం శ్రీ తిమిరాపహరాయ నమః ముఖం పూజయామి
ఓం శ్రీ దివ్య చక్షుషే నమః నేత్రే పూజయామి
ఓం శ్రీ మణికుండలాయ నమః కర్ణౌ పూజయామి
ఓం శ్రీ పద్మాక్షాయ నమః లలాటం పూజయామి
ఓం శ్రీ భానవే నమః శిరః పూజయామి
ఓం శ్రీ సర్వాత్మనే నమః సర్వాంగణ్యాని పూజయామి.

శ్రీ సూర్యా ష్టోత్తర శత నామావళి :
ఓం అరుణాయ నమః
ఓం శరణ్యాయ నమః
ఓం కరుణారససిన్ధవే నమః
ఓం అసమాన బలాయ నమః
ఓం ఆర్తరక్షకాయ నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం ఆదిభూతాయ నమః
ఓం అఖిలాగమవేదినే నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం అఖిలజ్ఞాయ నమః
ఓం అనన్తాయ నమః
ఓం ఇవాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం ఇజ్యాయ నమః
ఓం ఇన్ద్రాయ నమః
ఓం భానవే నమః
ఓం ఇన్ది రామన్దిర స్థాయ నమః
ఓం వన్దనాయాయ నమః
ఓం ఈశాయ నమః
ఓం సుప్రసననాయ నమః
ఓం సుశీలాయ నమః
ఓం సువర్చసే నమః
ఓం వసుప్రదాయ నమః
ఓం వసవే నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ఉజ్జ్వలాయ నమః
ఓం ఉగ్రరూపాయ నమః
ఓం ఊర్ధ్వగాయ నమః
ఓం వివస్వతే నమః
ఓం ఉద్యత్కిరణ జాలాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం ఊర్జస్వలాయ నమః
ఓం వీర్యాయ నమః
ఓం నిర్జయాయ నమః
ఓం జయాయ నమః
ఓం ఊరుద్వయాభారూప నమః
యుక్తసారథయే నమః
ఓం ఋషిచక్ర చరాయ నమః
ఓం ఋజుస్వభావచిత్తాయ నమః
ఓం నిత్య స్తుత్యాయ నమః
ఓం ఋకారా మాత్రుకావర్ణ రూపాయ నమః
ఓం ఉజ్వలతేజసే నమః
ఓం ఋక్ష్యాదినాధ మిత్రాయ నమః
ఓం పుష్కరాక్షాయ నమః
ఓం లుప్తదన్తాయ నమః
ఓం శాన్తాయ నమః
ఓం కాన్తిదాయ నమః
ఓం ఘనాయ నమః
ఓం కనత్కనక భూషాయ నమః
ఓం ఖద్యోతాయ నమః
ఓం లునితాఖిలదేత్యా నమః
ఓం సత్యానన్ద స్వరూపిణే నమః
ఓం అపవర్గ ప్రదాయ నమః
ఓం ఆర్త శరణ్యాయ నమః
ఓం ఏకాకినే నమః
ఓం భగవతే నమః
ఓం సృష్టి స్థిత్యంత కారిణే నమః
ఓం గుణాత్మనే నమః
ఓం ఘ్రుణి భ్రుతే నమః
ఓం బృహతే నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం ఐశ్వర్య దాయ నమః
ఓం శ ర్వాయ నమః
ఓం హరిదశ్వాయ నమః
ఓం శౌరయే నమః
ఓం దసదిక్స ప్రకాశాయ నమః
ఓం భక్తవశ్యాయ నమః
ఓం ఓజస్కరాయ నమః
ఓం జయినే నమః
ఓం జగదానన్ద హేతవే నమః
ఓం జన్మ మృత్యు జరావ్యాధి నమః
ఓం వర్జితాయ నమః
ఓం ఉచ్ఛస్థాన సమారూఢ రథస్థాయ నమః
ఓం అసురారయే నమః
ఓం కమనీయకరాయ నమః
ఓం ఆజ్జ వల్లభాయ నమః
ఓం అన్తర్బహిః ప్రకాశాయ నమః
ఓం అచిన్త్యాయ నమః
ఓం ఆత్మరూపిణే నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం అమరేశాయ నమః
ఓం పరస్మై జ్యోతిషే నమః
ఓం ఆహాస్కరాయ నమః
ఓం రవయే నమః
ఓం హరయే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం తరుణాయ నమః
ఓం వరేణ్యాయ నమః
ఓం గ్రహణాం పతయే నమః
ఓం భాస్కరాయ నమః
ఓం ఆదిమధ్యాన్త రహితాయ నమః
ఓం సౌఖ్య ప్రదాయ నమః
ఓం సకలజగాతాం పతయే నమః
ఓం సూర్యాయ నమః
ఓం కవయే నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం తేజోరూపాయ నమః
ఓం శ్రీం హిరణ్య గర్భాయ నమః
ఓం హ్రీం సంపత్కరాయ నమః
ఓం ఐం ఇష్టార్దదాయ నమః
ఓం సుప్రసన్నాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం శ్రేయసే నమః
ఓం భక్తకోటి సౌఖ్య ప్రదాయినే నమః
ఓం నిఖిలాగమనే నమః
ఓం నిత్యానన్దాయ నమః
ఓం ఉషాఛాయాదేవి సమేత శ్రీ సూర్యనారాయణస్వామినే నమః
శ్రీ సూర్యనారాయణస్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.

ధూపం:
శ్లో: ధూపం గృహాణదే వేశ సర్వసౌభాగ్యదాయక, మయానివేదితం తుభ్యం గ్రహరాజ నమోస్తుతే
ఓం శ్రీసూర్యాయ నమః దూపమాగ్రాపయామి.
దీపం:
శ్లో: అజ్ఞాన నాశనం దేవ సర్వసిద్ద ప్రదోభవ, సకర్పూ రాజ్యదీ పంచ సంగృహాణ దివాకర.
ఓం శ్రీసూర్యాయ నమః దీపం దర్శయామి
నైవేద్యం:
శ్లో: పరమాన్నంచ నైవేద్యం సఫలంచ సశర్కరం, గృహాణ సర్వలోకేశ మయాదత్తం సురేశ్వర.
ఓం శ్రీ సూర్యాయ నమః నైవేద్యం సమర్పయామి.
తాంబూలం :
శ్లో: సపూగీ ఫల కర్పూరం నాగవల్లీ దళై ర్యుతం, ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్.
ఓం శ్రీసూర్యాయ నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం:
శ్లో: నీరాజనం సుమంగళ్యం నమస్తే దివ్య తేజసే, ఇదం గృహాణ దేవేశ మంగళం కురుభాస్కర.
ఓం శ్రీసూర్యాయ నమః కర్పూర నీరాజనం దర్శయామి.
మంత్రపుష్పం :
శ్లో: భాస్కరాయ విద్మహే మహాద్ద్యుతిక రాయ ధీమహి, తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.
శ్లో: ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి, తన్నః స్సూర్యః ప్రచోదయాత్.
ఓం శ్రీసూర్యాయ నమః మంత్రపుష్పం సమర్పయామి.
ప్రదక్షిణం :
శ్లో: ప్రదక్షిణం కరిష్యామి సర్వపాప ప్రణాశన, సర్వాభీష్ట ఫలందేహి నమస్తే లోకభాంధవ.
శ్లో: చ్చాయా సంజ్ఞా సమేతాయ రవయేలోక సాక్షిణే, హరయే నూరు సూతాయ సప్తాశ్వాయ నామోనమః.
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ ప్రభాకర.
ఓం శ్రీసూర్యాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
పునఃపూజ:
ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి,నృత్యం దర్శయామి,గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచార,శక్త్యోపచార,భక్త్యోపచార పూజాం సమర్పయామి
శ్లో: యస్య స్మ్రు త్యాచ నామోక్త్యా త పం పూజా క్రియాది షు ; యానం సంపూర తాంయాతి సద్యో వందే మహేశ్వరం
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే.
అనేనా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః, సర్వం శ్రీ సూర్యనారాయణ దేవతార్పనమస్తూ.
రథ సప్తమీ వ్రతకథ
యుధిష్టిరుడు శ్రీ కృష్ణుని ఈ విధంగా అడిగెను.
"ఓ కృష్ణా! రథసప్తమినాడు చేయవలసిన విధివిధానము నాకు తెలియజేయుము అనగా .........
శ్రీ కృష్ణుడిలా జవాబిచ్చెను.
శ్లో|| అత్ర వ్రతే షష్ట్యామేక భుక్త్వం కృత్వా సప్తమ్యామరుణో దయ వేళాయాం -
శిష్టాచారాత్ సప్తార్క పర్ణాని సప్తబదరీ పత్రాణి వాశిర సినిధాయ ||
1. మాఘ శుద్ధ షష్టి రోజున స్నానం చేసికొని,దేవపూజ నిర్వర్తించి సూర్యాలయానికి వెళ్లి భగవానుణ్ణి ఆరాధించాలి.రాత్రి నిరాహారుడై నేలపైన పరుండాలి.తరువాత సప్తమినాడు ఉదయాన్నే లేచి సర్వాలంకృతమైన రథం నిర్మించి, మంటపం మధ్యనుంచి కుంకుమ గంధాక్షతలతో పూజించి, పూలహారాలతో అలంకరించి,సంపూర్ణ లక్షణమైన సూర్యవిగ్రహాన్ని రథంలో ఉంచి అర్పించాలి.నివేదన చేయాలి.రాత్రి జాగారం చేసి (నిదుర పోకుండా మేలుకొని) అష్టమినాడు ఉదయాన్నే స్నానంచేసి బ్రాహ్మణులకు కోరిన దానాలివ్వాలి.ఆ రథాన్ని, రెండు రక్త వస్త్రాలను (ఎర్రని వస్త్రాలను), రక్త వర్ణపు (ఎర్రని) ఆవునూ గురువుకు దానమివ్వాలి.ఈ వ్రతం ఆచరిస్తే భాస్కర ప్రసాదంవల్ల నీ కుమారుడు మహాతేజస్వి అవుతాడు. అపూర్వ బలపరాక్రమవంతుడై సమస్త భోగాలను అనుభవించి, నిరాటంకంగా రాజ్యం పరిపాలించి సూర్యలోకం పొంది,అక్కడ ఒక కల్ప పర్యంతం ఉండి,తరువాత చక్రవర్తిత్వం పొందుతాడు అని చెప్పాడు. ఇంకనూ ఈరోజున (రథసప్తమి రోజున) సూర్యదేవుడికి క్షీరాన్నం నివేదన (నైవేద్యం) చెయ్యాలి. ఈ ప్రసాదాన్నే ఎందుకు నివేదన చెయ్యాలనే దానికి కూడా ఒక కారణమున్నది. దక్ష యజ్ఞం జరిగినప్పుడు అల్లుడైన శివునికి పరాభవం కలిగింది. శివుడు ఉగ్రుడై మామమీదకు వీరభద్రుణ్ణి పరివారంతో సహా పంపించాడు.వీరభద్రుడి వీరవిహారంతో దేవతలందరూ దెబ్బతిన్నారు. ఆ సందర్భములోనే సూర్యుడికి పళ్లన్నీ రాలిపోయి బోసివాడయ్యాడు. కనుకనే సూర్య దేవుడికి అమూల్యమైన ప్రసాదం క్షీరాన్నం అని చెబుతారు. ఈ మాఘమాసంలోని నాలుగు ఆదివారాలు కూడా సూర్యునికి ప్రత్యేక పూజను నిర్వహించి పాలు పొంగించి క్షీరాన్నం చేసి నైవేద్యం పెడతారు.అని ఈ విధంగా చెప్పిన కృష్ణునితో యుధిష్ఠిరుడు ఈ వ్రతమును ఆచరించినచో చక్రవర్తి కాగలరని నీవు చెప్పియుంటివి. ఇంతకుముందు భూలోకములో ఎవరు ఈ వ్రతమును ఆచరించి అట్లు ఆ వ్రతఫలము యెవ్వరి కైననూ ప్రాప్తించినదా? అని పలుకగా కృష్ణుడు ఈ వ్రతమును గురించిన కథను ఈ విధముగా చెప్పసాగెను.
2. రథసప్తమీవ్రతం ఆచరిస్తే చక్రవర్తి పదవివస్తుందని నిరూపించే కథ భవిష్య పురాణంలో ఉన్నది. దీన్ని ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు తెలియజేసెను. కాంభోజ దేశమున యశోవర్తి యను చక్రవర్తి యుండెను. ఆయన వ్రుద్ధాప్యమున పరిపాకము (చేసిన పాపములయొక్క ఫలము) ఎందువలన కల్గెనో తెలుపవలసినదిఅని ఒక్కనొక బ్రాహ్మణశ్రేష్టుని అడిగెను.అట్లడిగిన రాజుతో 'ఓ రాజా! వీరువీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోభులై (పిసినారులై) యుండిరి.అందుచేత వీరిట్టి రోగములకు గురికావలసిన వారైరి. వారి రోగనివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను. ఆవిధముగా వారావ్రతము చూచినంత మాత్రమున దాని మహాత్యముచే వారి పాపములు పోవును.గాన, వ్యాధితో భాదపడువారిని గొనివచ్చి ఆవ్రత వైభవము వారికి చూపవలెను.'అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు 'అయ్యా! ఆ వ్రాత మెట్లు చేయవలెనో దాని విధి విధాన మేమో తెలుపుడని ప్రార్దించెన.' అందులకా బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అను పేరుగల వ్రతము సర్వులూ ఆచరించదగినది. ఆవ్రత ప్రభావమున సకల పాపములూ హరించి, చక్రవర్తిత్వము గల్గును. ఆవ్రత విధానము తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము.
3. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్టి దినమున గృహస్తు (యజమాని) యీ వ్రాతమాచరింతునని తలవవలెను.పవిత్ర జలములుగల నదులలోగాని, చెరువునందు గాని,నూతియందుగాని తెల్లనినువ్వులతో విధివిధానముగా స్నాన మాచరించవలెను లేదా ఇలవేలుపులకు,కులవేలుపులకు,ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటుపిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి,పుష్పములు,ధూపములు,దీపములు, అక్షతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను.పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి,అతిథులతో సేవకులతో,బాలకులతో భక్ష్య భోజ్యములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేదపారంగతులగు విప్రులను పిలిపించి,సూర్యభగవానుని విగ్రహాన్ని నియమము ప్రకారము పూజించి,సప్తమితిథి రోజున నిరాహారుడై, భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము 'ఓ జగన్నాథుడా! నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయించవలసినదిగా వేడుచున్నాను.అని వుచ్చరించుచూ,తన చేతిలో గల జలమును, నీటిలో విడువవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి, బ్రాహ్మణులు,తానూ గృహమున నేలపై నారాత్రి శయనించి జితేంద్రియుడై యుండి,ఉదయమున లేచి,నిత్యకృత్యము లాచరించి శుచియై యుండవలెను. ఒక దివ్యమైన సూర్యరథాన్ని దీపమాలికలతోను, చిరుగంటలతోను, సర్వోపచారాలతోను తయారుచేసి,సర్వాంగములను రత్నాలు, మణులతో అలంకరించవలెను. బంగారుతో గాని,వెండితో గాని గుర్రాలను,రథ సారధినీ, రథమునూ తయారుచేసి మధ్యాహ్నవేళ స్నానాదికములను నిర్వర్తించుకొనవలెను. వదరుబోతులను, పాషండులను, దుష్టులను,విడిచిపెట్టి ప్రాజ్ఞులు, సౌర సూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను.
4. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మాణావాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించవలెను.కుంకుమతోను,సుగంధ ద్రవ్యములతోను,పుష్పములతోను పూజించి, రథమున నున్న సూర్యుని సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు.లోభియై ధనమును ఖర్చు చేయుటకు మనస్సంగీకరించనిచో వ్రతము వైఫల్యమును,దానివలన మనస్సు వికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని,రథసారధిని అందుగల సూర్యభగవానునీ, పుష్ప,ధూప,గంధ,వస్త్ర,అలంకార,భూషనాదులు నానావిధ ఫల భక్ష్యాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలెను.
5. ఓ భాస్కరా! దివాకరా! ఆదిత్యా! మార్తాండ! గ్రహదిపా! అపాంనిథే! జగద్రక్షకా! భూతభావనా! భూతేశ! భాస్కరా! ఆర్త త్రాణ పరాయణా! హరా! ఆచింత్యా! విశ్వసంచారా! విభో ! హే విష్ణో ! ఆదిభూతేశా ! ఆది మధ్యాన్త రహితా! భాస్కరా! ఓ జగత్పతే! భక్తిలేకున్నను, క్రియాశున్యమయినను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము " పైవిధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్ధించవలెను. ధనహీనుడయినను, విధిప్రకారము అన్ని కార్యములు చేయవలెను. రథము, సారథి, గుర్రములు, వివిధరకాల రంగులతో లిఖించిన బొమ్మలు,ఏడు అయిన జిల్లేడు పత్రములతో సూర్యభగవానుని శక్తికొలదీ పూర్వము చెప్పినట్లు విధివిధానముగా పూజించవలెను. పురాణ, శ్రవణ, మంగళ గీతాలతో మంగళ వాద్యాలతో ఆరాత్రి జాగరణ చేసి, పుణ్య కథలను వినవలెను.పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సున ధ్యానము చేయుచు ప్రాతః కాలమున లేచి స్నానకృత్యమును నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి,వివిధ రత్నభూషణములతో, ధ్యానాదులతో, వస్త్రాలతో,తృప్తి పరచవలెను. అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును. అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యధాశక్తి దానము నీయవలెను. ఈ రథమును తమ పురోహితులయిన గురుదేవులకు రక్త(ఎర్ర రంగు) వస్త్ర యుగళంతో సమర్పించవలెను. ఆవిధంగా చేసినచో యెందుకు జగత్పతి గాకుండును?కాన, సర్వయత్నములచేతనూ రథసప్తమి వ్రాత మాచరించవలెను. దానివలన భాస్కరానుగ్రహము గల్గి మహాతేజులు,బలపరాక్రమవంతులు అయి విపుల భోగములననుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసికొందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్రపౌత్రులను బడసి చివరగా సూర్యలోకము చేరుదురు. అక్కడ ఒక కల్పకాలముండి చక్రవర్తిగా జన్మించి ఆ పదవిననుభవించును.
శ్రీ కృష్ణుడు చెప్పుచున్నాడు:
ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తనదారిని తాను పోయెను.రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్టుడుపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములన నుభవించెను. ఈవిధముగా ఆరాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి.ఈ కథను భక్తితో యెవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదలనిచ్చును. ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథీ గుర్రాలతో గూడుకోనిన శ్రేష్ట రథమును మాఘమాస సప్తమిరోజున యెవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వము పొందగలరు.
ఇతి రథసప్తమీ వ్రత కథా సంపూర్ణం.                         స్వస్తి.
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
రధసప్తమి యొక్క విసిష్టతను అష్టోత్తర శత నామావళితో పూజా విధానమును చక్కగా వివరించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.