గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఫిబ్రవరి 2014, గురువారం

శ్రీమన్మహాశివరాత్రి సందర్భముగా మీ అందరికీ ఆ పార్వతీపరమేశ్వరుల కటాక్షము లభించునుగాక.

జైశ్రీరామ్. 
ఆర్యులారా! 
శ్రీమన్మహాశివరాత్రి సందర్భముగా  యావద్భక్త జనావళికి ఆ పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షవీక్షణలు మంగళ ప్రదముగా లభించాలని మనసారా కోరుకొంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.
సహృదయ పూర్ణ భక్తతతి సాగిలి మ్రొక్కుచు నీ కటాక్షముల్
మహిమను గొల్పునంచు నసమాన మహద్వ్రత దీక్ష పూని, నీ
నిహితమునందు దృష్టినిడి నిన్ను భజించుట గాంచవా హరా!
సహృదయ భక్తపాళిఁ గని చక్కగ బ్రోవుమ పారవతీశ్వరా!
http://andhraamrutham.blogspot.in/search/label/%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81#.Uw6k1eO1bDk
జైహింద్.
Print this post

2 comments:

Ayyagari Surya Nagendra Kumar చెప్పారు...

నమస్కారం, శివరాత్రి శుభాకాంక్షలు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు
మధుర మైన బాలుగారి గళం వినిపించి నందులకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.