గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, నవంబర్ 2012, మంగళవారం

కవిసమ్మేళనము తే.30 - 11 - 2012 న చిక్కడపల్లిలో గల త్యాగరాయ గాన సభ లో జరగబోతోంది.

జైశ్రీరామ్.
సాహితీ బంధువులారా! 
అరసి వేయ వచ్చు అపరాధ సుంకమ్ము  -  పావు గంట దాటు వక్తపైన.
ధనమునపహరించు మనుజుఁడే దొంగయా?  -  కాన రాని దొంగ కాల హర్త.
ఇదెక్కడి పద్యమని ఆశ్చర్యపోతున్నారా? 
అభినవ వేమన, ఆంధ్ర పద్య కవితా పితామహుఁడు, పీఠికా ప్రబంధ పరమేశ్వరుఁడు
 అని కీర్తింపఁ బడిన 
మహా కవి నండూరి రామకృష్ణమాచార్యులవారు వ్రాసిన పద్యమిది.
లెక్కకు మిక్కిలిగా వ్రాసిన చక్కని మౌక్తికాలే కాదు. అపురూప ఖండికలు కూడా వీరి రచనలో చోటు చేసుకొన్నాయి. మహా ప్రజ్ఞాన్విత మహనీయ రచనా ధురీణులైన 
శ్రీ నండూరి రామ కృష్ణమాచార్యులవారి రచనలు - వ్యక్తిత్వము అనే అంశముపై 
కవిసమ్మేళనము 
తే.30 - 11 - 2012 న సాయంత్రం 5 గంటలకు
చిక్కడపల్లిలో గల త్యాగరాయ గాన సభ లో 
జరగబోతోంది.
నిర్వాహకులు
తెలుగు సాహిత్య కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు"సహస్ర పద్య కంఠీరవ" శ్రీ చిక్కా రామ దాసు.
ఈ కార్యక్రమమును ఆస్వాదించడానికి సహృదయులందరూ ఆహ్వానితులే.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.