గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, నవంబర్ 2012, బుధవారం

శివానందలహరి ఆధ్యాత్మిక సాహిత్య ఉపన్యాస కార్యక్రమము.

జైశ్రీరామ్.
శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు.
సోదరీ సోదరులారా! 
తూర్పు గోదావరి జిల్లా తుని గ్రామంలో శాఖా గ్రంథాలయంలో "శివానందలహరి"  అను అంశముపై  మన సాహితీ సన్మిత్రులు శ్రీ పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారి యొక్క ఆధ్యాత్మిక సాహిత్య ఉపన్యాసమును అచ్చటి సాహితీ ప్రియులు ఏర్పాటు చేసి యున్నారు.
ఉపన్యాస కార్యక్రమము తేదీ:- 15 - 11 - 2012.
సమయము:- సాయంత్రం గం.6:00 లకు ప్రారంభమగుము.
స్థలము:- శాఖాగ్రంథాలయము, తుని, తూర్పు గోదావరి జిల్లా.
వక్త:- పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు.
విషయము:- "శివానందలహరి" 
ఈ కార్యక్రమము వివరములను ఇంకా వివరముగా తెలుసుకొన గోరువారు 
శ్రీ యల్.యస్.వై.వి.శర్మ గారిని 9247168255 
దూరవాణి ద్వారా అడిగి తెలుసుకొనవచ్చును.
ఈ కార్యక్రమము విజయవంతంగా పరిపూర్ణమవాలని మనసారా కోరుకొంటూ, నిర్వాహకులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.