గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, నవంబర్ 2012, శనివారం

ప్రపంచ తెలుగు మహాసభలు 27th, 28th & 29th Dec 2012

జైశ్రీరామ్
సోదరీ సోదరులారా!తెలుగు భాషాభిమానులకు తెలుగు మాతృభాషగా కల యావన్మందికి శుభ వార్త. ప్రపంచ తెలుగు మహా సభలను ఈ సంవత్సరం మన దేశంలో మన రాష్ట్రంలో మన ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరి యున్న తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఏక క్రియా ద్వ్యర్థికరీ అన్నట్టుగా తెలుగువారు తెలుగు భాషా సంస్కృతుల కద్దంపట్టే కార్యక్రమాలను సభలో చూడడంతో పాటు మన స్వామివారి దివ్య దర్శన భాగ్యం కూడా పొందే అరుదైన సదవకాశం మనకు లభిస్తోందని తెలియ జేస్తున్నాను. ఈ క్రింది కరపత్రమును చదివి మిగిలిన వివరములను మీరు గ్రహింపనగును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.