గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జులై 2020, ఆదివారం

వందే గురు పరంపరామ్.

  జైశ్రీరామ్.
అల సదాశివుమదిలోననరసి కొలుతు
 వ్యాసభగవానునెన్నుదు వరలఁ జేయ
శంకరున్ మది కొలుతు శుభంకరముగ
నేటి గురువులఁ ధ్యానింతునిండు మదిని.
ఆర్యులారా! నేడు గురుపూర్ణిమ. మానవ జన్మకు సార్థకత కలిగే విధంగా సన్మార్గదర్శులైన గురువులు వ్యాసాది మహర్షులతోపాటు గౌరవింపబడే రోజు. ఈ సందర్భముగా మీకందరికీ శుభాకాంక్షలు.
ఏ సద్బోధనచే గురూత్తములు తా మీశానుఁ జూపింతురో
యా సద్బోధనె యా గురూత్తములనే యీశానుఁ జేయుగా.
ధ్యాసన్విద్యను నేర్చుచున్ గురువులన్ద్యానించువారిద్ధరన్
మోసంబీ జగమంచెఱింగినిజమౌ ముక్తిన్ గనన్ యోగ్యులౌన్..
సద్గురుదేవులకందరికీ వినమ్ర ప్రణామములు.
జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.