జైశ్రీరామ్.
ఆర్యులారా!
బ్రహ్మశ్రీ వేంకట సోమయాజుల ఆంజనేయ శర్మ (విరించి) శ్రీమతి భారతీ దంపతుల పుత్ర రత్నము
చి.యసస్వి ఆత్రేయకు చి.శారదతో వివాహము
సందర్భముగా జరుగనున్న
అష్టావధానము.
ప్రస్తుతమున్న అవధానులలో అతి పిన్న వయస్కుఁడు రాజమహేంద్రవరమునకు చెందిన
చి.తాతా సందీప్ శర్మ.
అవధానాద్భుత బోధనాగురువు
బ్రహ్మశ్రీ ధూళిపాళ మహదేవమణి మహనీయుని శిష్యకోటిలో ఒకఁడు.
జననము. తే.14 - 06 - 1994.
తూర్పు గోదావరి జిల్లా లోని కోరుకొండ, రాజమహేంద్రవరములలో ప్రాథమిక విద్యాభ్యాసము సాగినది.
2015లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము నుండి బీఎస్సీ - బయోటెక్నాలజీ పట్టభద్రులయిరి.
2017లో ఆంధ్ర విశ్వకళా పరిషత్ విశాఖపట్టణము నుండి ఎమ్మెస్సీ - బయోటెక్నాలజీ పట్టా పొందినారు..
చిన్నతనంలో నాయనమ్మ కీ.శే.
తాతా పార్వతమ్మ (విశ్రాంత తెలుగు పండితురాలు) ప్రోత్సాహంతో పద్యరచన ప్రారంభించిరి.
పద్యకళాతపస్వి శ్రీ ధూళిపాళ మహదేవమణి గారి శిష్యరికంలో అవధాన విద్య నేర్చుకొని,
తొలి అవధానాన్ని డిగ్రీ చవుతున్న రోజుల్లో
నన్నయ సారస్వత పీఠం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిరి.
ఇప్పటి వరకు ఒక ద్విగుణీకృత అష్టావధానముతో కలిపి 24 అష్టావధానాలు చేసిరి.
ఈ చిరంజీవి 25 వ అవధానము
తే. 25 - 11 - 2017 న ఉదయం గం.11 ల నుండి
టెలిఫోన్ కాలనీ కమ్యూనిటీహాల్,
జ్ఞాన సరస్వతీ దేవాలయం ప్రక్కన
రోడ్ నెం.1.
టెలిఫోన్ కాలనీ,
ఆ.కె.పురం,
హైదరాబాదు 500102,
లో జరుగనున్నది.
చరవాణి సంఖ్య. 8 6 3 9 8 9 9 1 8 1. // .8 5 2 2 9 3 5 5 3 0.
ఆంధ్రామృత పాన లోలురందరూ ఆహ్వానితులే.
జైహింద్.

వ్రాసినది
Labels:












1 comments:
నమస్కారములు
అవధాని చి. తాతా సందీప్ శర్మ గారికి అభినందనలు
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.