గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, అక్టోబర్ 2010, మంగళవారం

పండిత నేమాని వారికి ఘన సత్కృతి.

ప్రియ పాఠకులారా! శ్రీమదధ్యాత్మ రామాయణమును పద్య కావ్యముగా రచించిన శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు అశ్టావధానియే కాక సుప్రసిద్ధ కవులు అన్న సంగతి మనకు తెలిసిన విషయమే కదా! 
అట్టి కవి వరేణ్యుల కలమునుండి జాలువారిన శ్రీమదధ్యాత్మ రామాయణము అనే కావ్యము 23-10-2010 వ తేదీన విశాఖ పట్టణంలో ఆవిష్కరింపఁ బడింది.
తత్ సందర్భముగా ఈ సుకవి పుంగవుని వారి ఆత్మీయ బృందము ఘనంగా సత్కరించిన విషయం సహృదయులందరికీ ఆనమ్ద దాయకమే కదా! అట్టి ఆ కవి వరులనుద్దేశించి ఆత్మీయ బృందము అభినందన మందార మాలలో తమ భావనామృతాన్ని ఎలా తొణికిసలాడించారో మీరూ చదివి తెలుసుకొనేటందుకు వీలుగా ఆ పత్రాన్ని యథాతథంగా మీ ముందుంచుతున్నందుకు సంతోషంగా ఉంది.
ఇక మ్నీరు చదవాలని ఎదురు చూస్తున్న ఆ పత్రం ఇదే.

చూచారు కదండీ! ధన్యవాదములు.
శ్రీ నేమానివంశజులైన రామ జోగి సన్యాసి రావుగారికి మనం కూడా మన అభినందనలు తెలియఁ జేద్దాం.
పరమేశ్వరుఁడు ఈ కవి వరులకు దీర్ఘాయురారోగ్య ఐశ్వర్య ములను; కవితా పుష్టిని ద్విగుణీకృతంగా అమితంగా కలుగఁ జేయాలని క్తోరుకొంటూ అభినందనలు తెలియఁ జేస్తున్నాను.
జై శ్రీరాం.
జైహింద్
Print this post

1 comments:

కథా మంజరి చెప్పారు...

ఆ పత్రాన్ని యథాతథంగా మీరు మళ్ళీ టపు చేసి, బ్లాగులో పెట్టండి.చూసి ఆనందిస్తాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.