తమ 'శ్రవణానందం ' కావ్యంలో ఒక స్త్రీకి తిరుపతి వేంకట కవులు ఎంత విలువ కట్టారో చూడండి.
సీllపలుకొక్కటియే సేయు పదివందల వరాలు
వాలు చూపులు రెండు వేలు సేయు
నగవొక్కటియెసేయు నాల్గువేల వరాలు
విర్రవీగుట లారువేలు సేయు
పదమొక్కటియె సేయు పదివేల వరహాలు
లావణ్యమది యొక లక్ష సేయు
బలుసోయగమె సేయు పది లక్షల వరాలు
కులుకు నడక తీరు కోటి సేయు
ముద్దు గుల్కెడు నెమ్మోము మూడుకోట్లు
నాస సొబగెన్న డెబ్బది నాల్గు కోట్లు
నుదుటి సింధూర నామమ్ము నూరు కోట్లు
నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!
అసాధారణ కవితావేశ సంపన్నులైన శ్రీ తిరుపతి వేంకట కవులిరువురూ ఒకే కాంతను ఇంతగా మెచ్చుకున్నారూ అంటే ఆ కాంత ఏ కాంతయో?
జైశ్రీరాం.
జైహింద్.
Print this post
నీమము,నేరని,తమోపహ.క్షేమకా,భద్రకా,విష్టప,పుష్టిదా,స్తోమ,ధీమ,సత్వనిధి,మృత్యుంజయ,జ్ఞాపికా,శాంతాకార,గర్భ-"మనోజ్ఞ"-వృత్తము,
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
-
జైశ్రీరామ్.
మనోజ్ఞ:-వృత్తము,
నీమము మీర నేర నయా!నిష్టను వీడ నెన్నడున్!నీమా!నా మనంబీవే!శివా!
సోమ తమోప సత్వ నిధీ!సుష్టిగ పుష్టి నీ గదే!స్తోమా!ధీమ!ఓంకారంబువై!
భ...
1 వారం క్రితం
3 comments:
వందల నించి కోట్లకి పడగెత్తించారు .. బాగు బాగు
" అవునూ ! ఇంతకీ ఆ కాంత ఏ కాంతయొ ? మరి మాకు తెలియాలి కదా ? "
అంతటి మహకవులు సైతము "వెలజెప్ప" శక్యము కాదన్నారు గనుక "వెలకాంత" కానేరదు, "కులకాంత" కాబోదు కాబట్టి ఆమె అయితే "కవితా" కాంత కావలె లేక "కీర్తి" కాంత కావలె.
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.