జైశ్రీరామ్.
శ్లో. విపత్తిష్వవ్యథో దక్షో - నిత్యముత్థానవాన్నరః|
అప్రమత్తో వినీతాత్మా - నిత్యం భద్రాణి పశ్యతి||
తే.గీ. క్రుంగకాపదలందున క్షోణినిలిచి,
కార్యదక్షుఁడై, స్పృహఁ గల్గి క్రాలువాఁడు,
వినయముననొప్పువాఁడు వివేకశాలి,
శుభములాతనిన్ జేరుచు శోభఁ గొలుపు.
భావము. ఆపత్కాలంలో క్రుంగిపోనివాడికి, కార్యనిర్వహణలో నేర్పు కలవాడికి,
అప్రమత్తంగా మెలిగేవాడికి, వినయవిధేయతలు కలవాడికి ఎల్లప్పుడు శుభాలే
చేకూరతాయి.
జైహింద్.
Print this post
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.