జైశ్రీరామ్.
శ్లో. స్వాగతేనాగ్నయ స్తృప్తా, ఆసనేన శతక్రతుః।
పాదశౌచేన పితరః, అర్ఘ్యాచ్ఛమ్భుస్తథాతిథేః॥
తే.గీ. స్వాగతము పల్క నగ్నులు సంతసింతు,
రాసమున నింద్రుఁ డానంద మం దతిథికి,
పాదపాద్యాన పితరులు పరవశింతు,
రర్ఘ్యమున శంభుఁడానందమందు, మహిత!
భావము.
అతిథికి స్వాగతము పలుకుటతో అగ్ని, ఆసనము వేయుటతో ఇంద్రుడు,
పాదములు కడుగుటతో పితృదేవతలు, అర్థ్య, ఫల, పుష్ప, నైవేద్యాదులు
సమర్పించుటతో పరమేశ్వరుడు, సంతోషము పొందుదురు.
జైహింద్.
Print this post
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.