గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, నవంబర్ 2015, ఆదివారం

కార్తీక శుద్ధ ఏకాదశీ పర్వదిన సందర్భముగా మీకందరికీ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ రోజు పరమ పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి.
ఆజగన్నాథుని పరిపూర్ణ కరుణా కటాక్షములు మీపై ప్రసరించాలని జ్ఞానామృతాస్వాదనాపరులై దైవ జ్ఞాన సంపన్నులై ఐహిక సుఖ సంతోషములతో పాటు మహదాత్మానంద సంభరితులు కావాలని మాసారా కోరుకొంటూ శుభాకాంక్షలు తెలియఁ జేస్తున్నాను. 
శ్రీ జగన్నాథా! జ్ఞాన సంపన్నమైన మానవ జన్మను నీవు మాకు ప్రసాదించినందులకు నీపాదారవిందములకు అనవరత నమస్కృతులు.
పరమేశ్వర నీదయ పాఠకులన్
నిరపాయమహత్స్థితి నిల్పునుగా.
కరుణించుచు కావుమ కామ్యదుఁడా!
సిరిసంపదలిచ్చుచు చేకొనుమా!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మిత్రులు శ్రేయోభి లాషులు అందరికీ కార్తీక శుద్ధ ఏకాదశి శుభా కాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.