గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జులై 2014, మంగళవారం

బలవాన ప్యశక్తో உసౌ ...మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. బలవాన ప్యశక్తో సౌ, ధనవానపి నిర్ధనః
శ్రుతవానపి మూర్ఖశ్చ యో ధర్మ విముఖో జనః.
గీ. ఎవఁ డధర్మాతిరిక్తుఁడో యిలనతండు 
బలసుసంపన్నుఁడయ్యు నబలుఁడె కనఁగ, 
ధనికుఁడయ్యును చూడ నిర్ధనుఁడతండు. 
విద్య కల్గుయుహీనుఁడే విద్య చేత.
భావము. ఎవడు ధర్మానికి ప్రతికూలుడో , వాడు బలవంతుడైనా శక్తిహీనుడే. ధనవంతుడైనా దరిద్రుడే, చదువుకొన్న వాడైనా మూర్ఖుడే. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును ఇది నగ్నసత్యం ఎప్పడికైనా ధర్మమె గెలుస్తుంది ధర్మానుష్టానులే కీర్తి శేషులౌతారు .మంచివిషయం తెలిపారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.