గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, డిసెంబర్ 2012, బుధవారం

సాహితీ వేత్త శ్రీ పిస్కా సత్యనారాయణ గారికి సత్కృతి.

జైశ్రీరామ్.
తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంగా, మన రాష్ట్రప్రభుత్వంవారు వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు తెలుగులో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. అందులో విజయులైన అభ్యర్థులకు బహుమతిప్రదానం చేస్తున్న సందర్భములో స్థానికంగా తెలుగుభాషకు సేవ చేస్తున్న కళాకారులను గుర్తించి సన్మానం చేయవలసిందిగా విద్యాశాఖాధికారులు ఆదేశాలిచ్చారు. దాని ప్రకారం  మంచిర్యాలలో సాహిత్య, సంగీత, నాట్యరంగాల్లో కృషి చేస్తున్న ముగ్గురిని ఎంపిక చేసి సత్కరించారు. సాహిత్యరంగములో శ్రీ పిస్కా సత్యనారాయణ గారిని ఎన్నుకొని సన్మానం చేశారు. ఆ సందర్భంలోని ఛాయాచిత్రము.
 సాహిత్యరంగములో శ్రీ పిస్కా సత్యనారాయణ గారికి చేస్తున్న సన్మానం.
ఈ సందర్భంగా శ్రీ పిస్కా సత్యనారాయణ గారిని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ సత్యనారాయణ గారికి హృదయ పూర్వక శుభాభి నందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.