గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జులై 2012, గురువారం

మేలిమి బంగారం మన సంస్కృతి 121. నడవడిక ఎలాగుండాలంటే.

జైశ్రీరామ్.
శ్లో:-
నాzనిష్టం ప్రవదేత్ కస్మిన్  న ఛిద్రం కస్య లక్షయేత్.
ఆజ్ఞా భంగస్తు మహతాం రాజ్ఞః కార్యః నవై క్వచిత్.
ఆ:- 
పలుకకు మితరులకు పరువు బాపెడి మాట.
ఎంచఁ బోకితరుల వంచనలను.
పెఅద్దవారి మాట పెడచెవి పెట్టకు.
రాజునాజ్ఞవుడువ రాదు.గనుమ.
భావము:-
ఎవరికినీ అపకారకమైన మాటలు పలుకకుము. ఇతరుల లోపములెంచ వలదు. మహాత్ముల యొక్క, రాజుల యొక్క మాటలను మీరి నడువకుము.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

"బాగుంది మంచి సూక్తి " శ్లాఘ నీయులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.