గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మార్చి 2012, గురువారం

హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు దగ్గర ఉన్న పీపుల్స్ ప్లాజా లో మూడు రోజుల పాటు గోమాతోత్సవం

నమస్తే
హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు దగ్గర ఉన్న పీపుల్స్ ప్లాజా లో మూడు రోజుల
పాటు గోమాతోత్సవం నిర్వహింపబడుతోంది. దాదాపు డా బి ఆర్ కే ఆర్ ప్రభుత్వ
ఆయుర్వేద కళాశాల,  చరక డెయిరీ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం మన దేశంలో లభ్యమవుతున్న 29 రకాల దేశవాళీ ఆవులను ఈ ప్రదర్శనలో
ఉంచారు. ముఖ్యమైన ఏడు రకాల ఆవులను ఒక చోట ఉంచి వాటి ప్రదక్షిణకుగానూ
ఏర్పాటు చేసారు. గోవు ద్వారా ఎలాంటి ఉపయోగాలున్నాయో వాటిని ఎలా
పెంచుకోవచ్చో వివిధ విశేషాలు వారు అక్కడ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సప్త
గో ప్రదక్షిణ బహు ఆకర్షణీయంగా ఉంది.
ఈ ప్రదర్శన "దేశీ కౌ ఉత్సవ్" పేరిట ఈ బుధ, గురు, శుక్ర వారాల్లో మాత్రమే
ఏర్పాటు చేసారు. (28,29,30 మార్చి 2012). ఇక్కడ గో ఉత్పత్తులను వాటిని
రోజువారీ జీవితంలో వాడుకునే విధానాలనీ ఇతర గో సంబంధ విషయాలనూ
తెలుపుతున్నారు.

గోమాతా విజయతామ్.

జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మంచి ప్రదర్శన చూడ గలిగిన వారు అదృష్ట వంతులు . తెలియ జెప్పినందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.