ప్రియ పాఠకులారా!
సత్య వాక్ పరిపాలన విషయంలో మనం చాలా విన్నాం. అసత్య దూరులుగా ఉంటున్నాం. ఐతే ఆ సత్యవాక్ పరిపాలనమే ఒక్కొక్కసారి అప్రయోజనమే కాక ప్రమాదము కూడా కలిగించవచ్చును. ఈ విషయంలో ఒక కవి ఈ క్రింది శ్లోకంలో ఎంత చక్కని ఉపమానంతో వివరించి చెప్పాడో చూద్దామా?
శ్లోll
శూన్యతా పుణ్య కామేన వక్తవ్యానైవ సర్వదా
ఔషధం యుక్తమస్థానే గరళం నను జాయతే.
గీll
సత్యమైనను వ్యర్థమస్థానమైన
పలుక రాదది దుష్టమౌ ఫలిత మిడును.
ఔషధం బది యగుత యస్థానమునను
విషఫలంబిడు నరయుచు మసల వలయు.
భావము:-
మంచి ఔషధమే కాని; అస్థానమందు ఉపయోగించినచో అదే విషమైపోతుంది కదా! అదే విధముగ ఒక విషయము సత్యమే కావచ్చు. కాని అది నిరుపయోగమైనదీ; అస్థానీయమైనదీ కావచ్చు. కావున పుణ్య కామి యగువాడు సత్యమైనా శూన్య వచనము పలుకరాదు.
కావున విజ్ఞతతో మెలగుదాం.
జైహింద్.
Print this post
శీమతి డా. మలయవాసిని గారికి అభినందనలు. అనేక కంద గీత గర్భ చంపక మాల.
-
జైశ్రీరామ్.
శ్రీమతి డా. మలయవాసిని గారికి జగన్మాత ఆశీస్సులు.
అనేక కంద గీత గర్భ చంపక మాల.
👇🏼
వర గుణదాంబరో! మలయ వాసిని! మీకు నమస్కరింతు, శ్రీ
కర ప్రణవ...
3 వారాల క్రితం
వ్రాసినది
Labels:












1 comments:
నమస్కారములు రామకృష్ణా రావుగారు తమ శ్లొకం లొ చక్కగా చెప్పారు. నిజమె నిజాన్ని నిజంగా నె మాట్లాడినా అది తగని చోటు ఐనచొ విషం గా పరిగణిస్తుంది. మంచి విషయాలు చెప్పారు ధన్య వాదములు.
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.