శ్రీమదాంధ్ర భాషాభిమానులకు గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మ దినము ఒక పర్వ దినము. 29-8- 2008 వ తేదేని ఈ విషయాలను మనం అవకాశానుగుణంగా ఆ రోజున చర్చించుకొని ఉంటాం. ఆ పండుగ సంబరం ఆరోజుతో వదిలేస్తే ఆంధ్రులు ఆరంభశూరులు అనే అపప్రధ నిజం చేసినవారిమవతాం. 29-8-2009 వ తేదీన మనం సింహావలోకనం చేసుకొందాం. అందుకు సరయిన ప్రణాళిక ఇప్పుడే నిర్మించుకోవాలి. మనకు ఆంగ్లం మాటలాడడం అత్యవసరం అనుకున్నప్పుడు రోజులో కనీసం కొన్ని గంటలయనా స్వచ్ఛమయిన తెలుగు మాటలాడే ప్రయత్నం చేయగలిగితే మన ఆంద్ర భారతి మనకు దూరం కాదు. అవునంటారా.................కాదంటారా..........?
క:-దినమునకొక గంటైనను
మనమంతా తెలుగుపలికి దివ్యత్వమునీ
తెనుగుకు గొలుపగ నేర్చిన
మన భాషకు గుర్తు కలిగి మన్ననలందున్.
ఇదీ నా అభిప్రాయం. మరి మీరేమంటారు? వీలయితే మీరు ఛందోబద్ధంగా చెప్పండి.
చింతా రామకృష్ణా రావు
Print this post
వైద్యం వారికి తోపెల్లవారి సభలో నా చిత్రకవితాంజలి.
-
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శ్రీ తోపెల్ల వారిచే బ్రహ్మశ్రీ వైద్యంవేంకటేశ్వరాచార్యులవారికి
సాహితీచిత్రగుప్త బిరుదు ప్రదానము జరిగిన సందర్భముగా
*చిత్...
3 రోజుల క్రితం
వ్రాసినది












1 comments:
మీ బ్లాగ్ పేరు భలే నచ్చింది.
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.