గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2009, శనివారం

" బాష్పాంజలి "

అశ్రు తర్పణం.

కీ.శే.Dr.Y.S.రాజశేఖర రెడ్డి గారు తే. 02 - 09 - 2009. దీని అకాల మరణం పొందిన సందర్భంగా
వనస్థలి పురం - శారదా నగర్ కోలనీ వాసులు
తే.12 - 09 - 2009. దీని శ్రద్ధాంజలి ఘటిస్తున్న సందర్భముగా సమర్పించిన

" బాష్పాంజలి "
సమర్పణ:- చింతా రామ కృష్ణా రావు. హైదరాబాదు.

సీ.
అన్న దాతకు నీరు నందింప జల యజ్ఞ
మార్గాన నడచిన మహితమూర్తి !
రెండు రూకల బొజ్జ నిండ బియ్యమునిచ్చి,
పేదల పాలిటి పెన్నిధివయి,
ఆరోగ్య పథకంబు నమలు జేయుచు నాయు
రారోగ్యములు పెంచి, ధీరుడవయి,
గృహములు నిర్మించి, గ్రహ గతి మార్పించి,
గూడు లేని జనుల గోడు తీర్చి,
అమ్మలారా ! నాదు అక్కలారా ! యంచు
నాప్యాయముగ పిల్చి, యాదరించి,
గీ.
ప్రేమఁ జూపుచు, మదులలో రాముడవయి,
స్థిరుడవైనావు. యింతలో చెప్పకుండ
స్వర్గ పథమందితివి నీవు. సఖుడ ! నేను
చేతు, బాష్పాంజలులు, రాజశేఖరుండ !!
Print this post

1 comments:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

కవీంద్రా... సున్నితమైన అంశాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.