28, సెప్టెంబర్ 2009, సోమవారం
మేలిమి బంగారం మన సంస్కృతి 61.
0
comments
Labels:
మేలిమి బంగారం మన సంస్కృతి
26, సెప్టెంబర్ 2009, శనివారం
నవదుర్గా ప్రార్థన
4
comments
Labels:
పద్యరచన
జగదంబ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు.
0
comments
ఈ రోజు దుర్గాష్టమి. ఈ రోజూ, రేపూ, ఎల్లుండి,గొప్ప పర్వ దినాలు. మహాష్టమి, మహర్నవమి, మహా దశమి.
Labels:
పద్యరచన
25, సెప్టెంబర్ 2009, శుక్రవారం
శ్రీ వేపా భీమ శంకరం గారి దివ్య వ్యక్తిత్వము
0
comments
Labels:
సాహితీ సంపద
మేలిమి బంగారం మన సంస్కృతి 60.
0
comments
Labels:
మేలిమి బంగారం మన సంస్కృతి
24, సెప్టెంబర్ 2009, గురువారం
మేలిమి బంగారం మన సంస్కృతి 59.
0
comments
Labels:
మేలిమి బంగారం మన సంస్కృతి
21, సెప్టెంబర్ 2009, సోమవారం
దత్తపది పూరణ. విషయం: రాజశేఖరుని చరమ యాత్ర.
1 comments
సుజనులారా!
శ్రీ కంది శంకరయ్య గారిచ్చిన సమస్యాపూరణలను నేను చేసినవి చూచిన జయభారత్ గారు తమ అమూల్యమైన అభిప్రాయాన్ని వ్రాస్తూ దత్త పదిని పూరించమని వారి సరదా తీత్చమని వ్రాశారు . నేను పూరించే ప్రయత్నం చేశాను. మూరూ పరిశీలించండి.
మా సంభాషణ యిలా సాగింది. చూడండి.
jaiabhaarat గారిలాగన్నారు.
నమస్కారం రామకృష్ణ రావు గారు
పూరణ చాలా బాగుంది
నా సరదా కూడా కొంచెం తీర్చండి
ఈ కింది పదాల తో పద్యం కావాలి
ఒక్కొక్క లైన్ లో ఈ పదాలతో
రాజశేఖరుడు
హెలికాప్టర్ [లేక]లోహ విహంగం
నల్లమల అడవులు
పావురాల గుట్ట
regards
jayabharath
September 20, 2009 6:59 PM
ఆర్యా! మీ సంతోషం వ్యక్తం చేసినందుకు ధన్యవదములు.
మీరిచ్చినది దత్త పది . విషయం చెప్పలేదు. ఐనా మిమ్మల్ని నిరాశ పరచ కుండా పూరించుతున్నాను చూడండి.
విషయం:- రాజ శేఖరును చరమ యాత్ర.
సీ:-
రాజశేఖరుడు విరాజ మానముగను - రచ్చబండకు నేగె. రహిని వెడల
లోహవిహంగము సాహసంబున నేగ - మేఘమడ్డుగ వచ్చె మింటిపైన.
నల్లమలడవులు తెల్లబోవుచు చూచె. - పావురాయిల గుట్ట భయము నొందె.
కాల వాహిని వాని కబళింపగాఁ బూనె. - యేమి చెప్పగనగు నీశ్వరేచ్చ
గీ:-
గాలిలో నేగు యంత్రము నేలఁ గూలె.
జాడఁ గానుట కైనను సాధ్య పడని
భీకరంబైన యడవితో నేకమ్మయ్యె.
శేఖరుండేగె దివికిని చిత్రముగను.
చూచారుకదండి. మీ అభిప్రాయాలను, వాటితో పాటు పూరణకై యివ్వ దలచుకుంటే సమస్యలను కాని, దత్త పదిని కాని, వర్ణనలను కాని, ఛందో భాషణను కాని, వ్రాసి పంపండి. ఆ శారదాంబ నాచే పూరింపఁ జేస్తుందేమో చూద్దాము.ఆన్నట్టు చెప్పడం మరిచాను. ఏ తేదీ ఏ వారమౌతుందో మీరడిగితే నేను సమాధానమిచ్చే ప్రయత్నం కూడా చేయగలనని మనవి.
జైహింద్.
Labels:
సమస్యా పూరణం
20, సెప్టెంబర్ 2009, ఆదివారం
నవ దుర్గలలో బ్రహ్మచారిణి.
0
comments
శరన్నవ రాత్రులలో నేడు అమ్మవారు బ్రహ్మచారిణీ రూప ధారియై భక్తుల కోరికలు తీర్చనున్నారు.
బ్రహ్మచారిణీ రూప ప్రత్యేకతను తత్ భక్తుల కొనగూడు ఫలమును తెలుసుకొందాము.
క:
శ్రీకర నవ దుర్గలలో
ప్రాకటముగ బ్రహ్మ చర్య భద్రాకృతితో
లోకులఁ గావగ నేడు శు
భాకరమయి తోడు నిలిచె భవ్యోజ్వలయై.
సీ:-
తపమాచరించెడి తల్లి యీ జగదంబ - బ్రహ్మమున చరించు భక్తి తోడ.
కుడిచేతఁ జపమాల ఎడమ చేతను కమం - డలమునూనినభక్త సులభురాలు.
పరమేశు పతికాగ పరమతపముఁ జేసి - ఉమయను పేరొందె. కమల నేత్రి.
జ్యోతిర్మయాకృతి సోభిల్లు జగదంబ. - శుభములు గొలిపెడి యభవు రాణి.
గీ:-
భక్తులను, సిద్ధులను గాచు శక్తి యీమె.
బ్రహ్మ చారిణి కృపఁ గోరు భక్తులకును
దీక్ష, సిద్ధియు, విజయంబు, రక్ష గొలుపు.
బ్రహ్మ చారిణిఁ గొలువుడీ! భక్త జనులు.
జైహింద్.
Labels:
పద్యరచన
19, సెప్టెంబర్ 2009, శనివారం
శరన్నవరాత్రి శుభాకాంక్షలు.
0
comments
Labels:
పద్యరచన
18, సెప్టెంబర్ 2009, శుక్రవారం
సమస్య యేదైనా సమాధానం ఒక్కటే.
0
comments
రమణీయోపవనోపశోభితము హైద్రాబాదులో నాపగో
త్తమమై నీటినొసంగినట్టి ముచికుందన్ నమ్ముకున్నన్ వృధా!
సుమతిన్ నాయకులేకలక్ష్యముగ నస్తోకాంబుసంపూర్ణ గా
త్రము గోదావరి నీరమైన ప్రజకున్ దాహార్తి పోకార్చెడున్.
2)
ఆగెన్ హైదరబాదు వాసులకు నీళ్ళందించు సత్కార్యమే
యేగెన్ "మూసి" కృషించి, నీటికొఱకై యెన్నెన్ని కష్టంబులో
బాగైనట్టివి సత్వరంబుగను కాల్వల్ ద్రవ్వి తెప్పించు కృ
ష్ణా గోదావరి నీరమైన ప్రజకున్ దాహార్తి పోకార్చెడున్.
3)నిజానికి మొదటగా రాసిన పద్యమిది. ఎందుకో తృప్తికరంగా లేదు.......
రమణీయోపవనాంతరస్థకుజరాడ్రక్షైకదీక్షావిలో
లమతుల్ సంతతరాజకీయకరణాలంకారు లొక్కింత లో
కము మెచ్చన్ పథకమ్ము లక్ష్యముగఁ గాల్వల్ దీసి రప్పించు కృ
ష్ణమ గోదావరి నీరమైన ప్రజకున్ దాహార్తి పోకార్చెడున్.
Labels:
సమస్యా పూరణం
16, సెప్టెంబర్ 2009, బుధవారం
సమస్యా పూరణము చేద్దామా ?
6
comments
Labels:
సమస్యా పూరణం
వ్రాసినది












ప్రియ సాహితీ బంధువులారా! కొన్నిసమస్యలను, వాటికి సంబంధించిన పూరణలను మీ ముందుంచుతున్నాను.
రామకృష్ణారావు గారూ, సమస్యలను పంపమన్నారుగదా. ప్రస్తుతానికి నాలుగు ఆందిస్తున్నాను. చూడండి....అంటూ శ్రీ నంది శంకరయ్య గారు పంపిన సమస్యలు, వాటికి సంబంధించిన నా పూరణలు
ఇక చూడండి..
1) కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్.
2) మాంసాహారమె శ్రేష్ఠమైనదనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.
3) రాజేడ్చెను రాణి యేడ్చె రాజ్యము నవ్వెన్.
4) నటులెవ్వరు లేని వింత నాటకమయ్యెన్.
1}
కోటులు సంపాదించెను.
వాటముగా దానినంత వారసుకిచ్చెన్
వాటా గొని, తరిమె నతడు.
కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్.
2}
మాంసంబమ్ముచు నున్ననొక్కరుడు తా మాన్యుండయెన్. భుక్తికిన్
మాంసాహారము శ్రేష్టమైన దనుచున్. మాన్యుండయెన్ విప్రుడే.
హింసామార్గము జేరనీక ప్రజలన్ హేయంబుగాఁదెల్పుటన్
హింసామార్గమదేలగొంటి వకటా! హృద్యంబొకో? శంకరా?
3}
రాజూ, రాణీ, రాజ్యము,
రంజిలి, యాడంఁగ బోవ, "రాజ్యము" గెలిచెన్.
రాజూ రాణీ యోడిరి.
రాజేడ్చెను. రాణి యేడ్చె రాజ్యము నవ్వెన్.
4}
జటిలపు నాటకమును గొని
యెటులో తమలోన తామె యిది నడిపించెన్.
నటులౌదురె వారు? మహా
నటులెవ్వరు లేని వింత నాటక మయ్యెన్.
అవకాశముంటే మీరూ పూరించి పంపగలందులకు ఆశిస్తున్నాను.
జైహింద్.