22, మార్చి 2025, శనివారం
చిన్న జీయర్ స్వామి అసత్య ప్రచారం! ప్రశ్నించిన హిందూ ధర్మ రక్షా సమితి.
0
comments

అనవద్య,పనిగొను,మనసా,వచసా.అమేయ,వాదన,మాథురి,దశదిశ,వ్యాపక.మలుపు,పలికించు,సతతము,వరదమము,అలవాటు,గర్భ"-తొలికిస లాడు,"-వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
0
comments
జైశ్రీరామ్.
అనవద్యము పద్యమునే!ఆదరమున గొల్వగన్! అలవాటయె!చిన నాటన్!

కొనియాడు,దవళ తేజం.స్వర్గం!కౌతుకం.త్రాతే దాత.కీర్తించు,శాంతం.మోక్షము,నీతీ నీమం,ఘన కీర్తి,తోడూ నీడ,కువలయం.జీవన సత్యం.ధర్మ మార్గం,గర్భ"-నీతే ము రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,ఖ్యం"-వృత్తము,
0
comments
జైశ్రీరామ్.
నిను వీడని నీడే!దైవమ్!నివురు గప్పిన నిప్పే!నీతే!సత్యం ధర్మం బిలలోన్!

చేతనా,అచేతనా,శూన్యతా.ఘౌతుక,చైదము,కావరము,మా' వర,చిత్తజ,సదయా,భూత హిత,భూవర,మా, వరదము,చిత్తాహిత,ఝళిపించు, గర్భ"-మాతృ పోషణా"-వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,,
0
comments
జైశ్రీరామ్.
చేత నచేతనా శూన్యమౌ!జీవన మింతే!కదయా!చిత్తాహిత దోషా లేలనో?

రామాయణ పద్యకావ్య సమర్చనా యజ్ఞము...... యజమాని శ్రీ కడయింటి కృష్ణ మూర్తి. నిర్వహణ. ప్రజ - పద్యం.
0
comments

బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి అమోఘమయిన ఉపన్యాసం.
0
comments

సర్పః క్రూరః ఖలః క్రూరః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. సర్పః క్రూరః ఖలః క్రూరః - సర్పాత్క్రూరతరః ఖలః
మంత్రేణ శామ్యతే సర్పః - నఖలః శామ్యతే కదా!
తే.గీ. క్రూరుఁడెన్నగ ఖలుఁడిల, క్రూర మహియు,
మంత్రమున లొంగిపోవును మహిని పాము,
ఖలుఁడు లొంగడేవిధినైన కఁలతఁ బెట్టు,
ఖలుఁడుగా నుండఁబోకుము వెలుగుము ధర.
భావము. సర్పము క్రూరమైనది. ఖలుఁడునూ క్రూరమైనవాఁడే. కాని సర్పము
కంటే ఖలుఁడే క్రూరతరుఁడు. ఎందుకనగా, మంత్రముతో సర్పము శాంతించును.
ఖలుఁడు (దుష్టుడు) ఏ విధముగనూ శాంతింపడు.
జైహింద్.

య్యోర్హిషిఖెయ్ - చామరగ్రాహిణి - విశ్వనాథ.....Sri Viswanatha Satyanarayana- ..
0
comments

విలోమానులోమ శ్లోకము.
0
comments
జైశ్రీరామ్.
విలోమానులోమ శ్లోకము.
ఈ శ్లోకం మొదటినుంచి కొసవరకు చదివినా,
కొసనుండి మొదటికి చదివినా,
అర్థం చెడకుండా అవే అక్షరాలు.
శ్లో. భోజరాజ మహ దేవ
కాళిదాస మనోహర
రహనోమ సదాళికా
వదేహ మజరాజభో.
జైహింద్.

అకారేతర వర్ణ నిషేధము. పద్యము.
0
comments
జైశ్రీరామ్.
అకారేతర వర్ణ నిషేధము. కందపద్యము.
పరమదయాకర శుభకర
నరవరనుత గరుడగమన నగధరపరమ
మురహర భవహర మాధవ
ధరాధరనుత ధవళనయన దశరథతనయా!
జైహింద్.

21, మార్చి 2025, శుక్రవారం
ఎవరు జగద్గురువుగా గౌరవింపఁబసుటకు అర్హులు.... శ్రీ సామవేదం షణ్ముఖశర్మ.
0
comments

19, మార్చి 2025, బుధవారం
భూమిపైకి క్షేమంగా చేరిన భారత సంతతికి చెందిన నాసా (NASA) వ్యోమగామి సునీతా విలియమ్స్, (Sunita Williams) ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ లకు అభినందన పూర్వక స్వాగతం.
0
comments
జైశ్రీరామ్.
గతేడాది జూన్ 5న వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి.. అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా (NASA) వ్యోమగామి సునీతా విలియమ్స్, (Sunita Williams) ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు (Butch Wilmore)9 నెలల అనంతరం భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.15 గంటలకు తిరుగుప్రయాణమయ్యారు. 17 గంటల అనంతరం డ్రాగన్ కాప్సూల్ భూవాతావరణంలోకి బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకుపారాచ్యూట్ల సాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్స్ సురక్షితంగా చేరారు.
ఈ విషయానికి ప్రపంచదేశాలన్నీ చాలా సంతోషీస్తున్నాయి.
మనకైతే మన బిలియంస్ క్శేమంగా చేరినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. వ్యోమగాముకను క్షేమంగా చేరేలా చేసిన శాస్త్రవేత్తలకృశ్గిని అభినందిస్తూ ఆ పరమాత్మకు కృతజ్ఞతలతో పాదాభివందనము చేయుచున్నాను.
జైహింద్.
పిబతు - గీతామృతమ్........ శ్రీ వైద్యంవేంకటేశ్వరాచార్యులు.
0
comments
జైశ్రీరామ్.
మహాభారతేతిహాసంలో మహర్షి వేదవ్యాసుడు మనకు గీతామృతాన్ని అందిందించినారు. భారతంలో భగవద్గీతాదిగీతలు పదునారు (16) ఉన్నాయి.వాటి క్లుప్తపరిచయం.
1.భగవద్గీత : మహాభారతంలోనిభీష్మపర్వంలో25వ అధ్యాయంనుండి42వ అధ్యాయం వరకు18అధ్యాయాలలో విరాజిల్లుతోందిగీత.శ్రీకృష్ణభగవానుడు అర్జునుడికి చేసిన దివ్యోపదేశంభగవద్గీత.ఇది శాస్త్రంగ ఉపనిషత్తుగకీర్తించబడుతున్న దివ్యభాగం.
2.ఉతథ్యగీత : మహాభారతశాంతిపర్వంలోని2అధ్యాయాలలో(90-91)ఉతథ్యగీత ఉంది.బ్రహ్మజ్ఞానసంపన్నుడైన ఉతథ్యమహర్షి మాంధాతృచక్రవ ర్తికి ధర్మపరిపాలన ఆవస్యకతను ఉప దేశించిన భాగమిది.
3.వామదేవగీత : ఇదిశాంతిపర్వం లో ఉతథ్యగీత తర్వాత 3అధ్యాయాలలో(92-94)ఉంది.వామదేవమహర్షివనుమనుడికి ఉపదేశించి నాడని భీ ష్ముడు ధర్మరాజుకు చెప్తాడు.
4.ఋషభగీత : ఇదికూడ శాంతి పర్వంలోనే 4అధ్యాయాలలో(125-128)వివరించబడింది 'ఆశ' విషయంగ ధర్మరాజు అడిగిన ప్రశ్నకు భీష్ముడుఋషభుని ఉపదేశాన్ని వినిపిస్తాడు.
5.షడ్జగీత : ఇదికూడ శాంతిపర్వంలోని ఉపపర్వమైన ఆపద్ధర్మపర్వంలో ఒక (167) అధ్యాయంలో తెలుపబ డింది.ధర్మరాజు తన తమ్ముళ్లు మరియు విదురుడుధర్మార్థకామాలలోఏదిఉత్తమమైనదో అనే అంశంగురించి చర్చించబడిన విషయం కనుక దీనినిషడ్జగీత అని పేర్కొన్నారు.
6.శంపాకగీత : శాంతిపర్వంలోనిఒకే ఒక అధ్యాయం(176)లో విరాజిల్లుతోంది ఈ గీత.భీష్ముడిని ధర్మరాజుధనవంతులకూ నిర్ధనులకూ సుఖదుఃఖాలు ఏ రూపంలో సంక్రమిస్తాయనిప్రశ్నిస్తే శంపాకుడు చెప్పిన ఇతిహాసన్ని వివరిస్తాడు.
7.మంకిగీత : ఇదికాక శాంతిపర్వంలో శంపాకగీత తర్వాత ఉంది. ఇదికూడ ఒక అధ్యాయం(177)లో ఉంది. ధనాశతోఎంతో ప్రయత్నంచేసినవాడుదానిని పొందాలంటే ఎలా సుఖాన్ని పొందుతారు అన్న ధర్మరాజు ప్రశ్నకుభీష్ముడుసమాధానంగఈగీత చెప్తాడు
8.బోధ్యగీత : ఒక అధ్యాయంలో (178) విరాజిల్లుతున్న గీత ఇది. ఎలా టి బుద్ధినికలిగిఉంటేశాంతినీ సుఖాన్నీపొందవచ్చు అన్న ధర్మరాజు ప్రశ్నకు భీష్ముడు ఈ గీతను చెప్తాడు.
9.విచఖ్నుగీత : ఇది శాంతిపర్వం లోని ఉప పర్వమైన మోక్షధర్మపర్వంలో(265అధ్యాయం) ఉంది. దీనిలోఅహింస ప్రశంస ఉంది.
10.హారితగీత : శాంతిపర్వం 278అధ్యాయంలోఉంది.పరబ్రహ్మను పొందేవారి ప్రవర్తన స్వభావం ఎలాఉండాలనే హారితుని ఉపదేశం ఇది.
11.వృత్రగీత : ఇది ఒకఅధ్యాయం (279) లో ఉపవర్ణితం. కర్మఫలం గు రించి శుక్రాచార్యుడు వృత్రునికి బోధించిన గీత ఇది.
12 పరాశరగీత : శాంతి పర్వం లోని 290-298అధ్యాయాలలో ఈగీత ఉంది. తొమ్మిది అధ్యాయాలున్నదీనిలో--మానవుడుఏశుభకార్యాలను ఆచరించి ఇహ పర లోకాలలో పరమశ్రేయస్సును పొందగలడనే విషయంజనక పరాశర సంవాదరూపకంగఉంది
13.హంసగీత : ఇది శాంతిపర్వం లో 299వ అధ్యాయం. సత్య దమాదిప్రశంస దీనిలో ఉంది.
14.బ్రాహ్మణగీత: అశ్వమేధపర్వంలోని అనుగీతపర్వం లో15వఅధ్యాయాలలో(206-346)శ్రీకృష్ణుడు అర్జునకు చేసిన ఉపదేశం ఇది.
15.అనుగీత : బ్రాహ్మణగీతానంత రం ఈ గీత 17 అధ్యాయాలలో(35-51)ఉన్న అనుగీత గురుశిష్య సంవాదరూపాత్మకం. అర్జునుడు తనకు శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశం మరిచానని చెప్పగా ఆ విషయ పరిజ్ఞానాన్నికలిగించే ఇతిహాసాన్ని భగవానుడుఉపదేశించిన ఇందలి విషయం.
16.యాజ్ఞవల్క్య గీత: భారత శాంతిపర్వంలోని 310అధ్యాయం నుండి 318 అధ్యాయం వరకూ ఈగీతను యజ్ఞవల్క్యమహర్షి జనకు నకు చేసిన సృష్టివర్ణనాదులు కలిగినగీత ఇది.
ఇంతటి సద్విషయ సమాహార గీతలు మహాభారత శాంతిపర్వం మనకు అందిస్తుంది.
సంస్కృత మహాభారత శాంతిపర్వం తెలుగువ్యాఖ్యానంఉన్నదిగీతాసక్తులు తప్పక అధ్యయనం చేయగలరు.
జైహింద్.