శ్రీమదాంధ్ర భాషాభిమానులకు గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మ దినము ఒక పర్వ దినము. 29-8- 2008 వ తేదేని ఈ విషయాలను మనం అవకాశానుగుణంగా ఆ రోజున చర్చించుకొని ఉంటాం. ఆ పండుగ సంబరం ఆరోజుతో వదిలేస్తే ఆంధ్రులు ఆరంభశూరులు అనే అపప్రధ నిజం చేసినవారిమవతాం. 29-8-2009 వ తేదీన మనం సింహావలోకనం చేసుకొందాం. అందుకు సరయిన ప్రణాళిక ఇప్పుడే నిర్మించుకోవాలి. మనకు ఆంగ్లం మాటలాడడం అత్యవసరం అనుకున్నప్పుడు రోజులో కనీసం కొన్ని గంటలయనా స్వచ్ఛమయిన తెలుగు మాటలాడే ప్రయత్నం చేయగలిగితే మన ఆంద్ర భారతి మనకు దూరం కాదు. అవునంటారా.................కాదంటారా..........?
క:-దినమునకొక గంటైనను
మనమంతా తెలుగుపలికి దివ్యత్వమునీ
తెనుగుకు గొలుపగ నేర్చిన
మన భాషకు గుర్తు కలిగి మన్ననలందున్.
ఇదీ నా అభిప్రాయం. మరి మీరేమంటారు? వీలయితే మీరు ఛందోబద్ధంగా చెప్పండి.
చింతా రామకృష్ణా రావు
Print this post
యోజనానాం సహస్రే ... నుండి ... స్వభావో నోపదేశేవా - వరకు. మేలిమిబంగారం మన
సంస్కృతి.(552 - 724వ శ్లోకము)
-
552. శ్లో. యోజనానాం సహస్రే ద్వై ద్వైశతే ద్వై చ యోజనే
ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే. (సాయణా చార్యులు)
ఆ.వె. అర్థ నిమిషమందు నల రెండు వేలును
రెండు వంద...
1 రోజు క్రితం
వ్రాసినది












1 comments:
మీ బ్లాగ్ పేరు భలే నచ్చింది.
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.