Wednesday, April 8, 2009 వ తేదీన వృత్త పద్య రచన సాధన చేద్దామా? 2 వ భాగంలో వృత్త పద్యమున యతి ప్రాస నియమములను తెలుసుకొంటూ ఊత్పల మాల వృత్త లక్షణాన్ని కూడా తెలుసుకున్నాం.
ఇప్పుడు ఆ ఉత్పల మాల వృత్త పద్య రచనకు సాధన చేద్దామా?
ఐతే ఈ పని మన పరస్పర సహకారం వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. ఇంక మనం ఏంచెయ్యాలో ఆలోచిస్తే ఒక్కొక్క పద్యాన్ని మనం అందరం కలిసి పూరించే ప్రయత్నం చేస్తూనే దోషాలుంటే పరస్పరం తెలుపుకొంటూ సరి చేసుకోవడం ద్వారా సరిగా నేర్చుకొంటూ రచనలో పురోగమిద్దాం.
విషయానికొస్తే ఈ మధ్య అంతర్జాల భువన విజయంలో గొప్పగొప్ప కవులు అతి సునాయాసంగా చేసిన పూరణలకు సంబంధించిన సమస్యలను మనం కూడా మన తరహాలో పూరిద్దాం.
ఈ క్రమంలో నేను ముందుగా సమస్యను మీ ముందుంచుతున్నాను. మీరు మోత్తం పూరించెస్తే మహదానందం. అలా కాకుండా ఒకటి లేక రెండు పాదాలు మీరు పూరించి మిగిలిన పాదాలను పూరించే ఆసక్తి గలవారు పూరించేలా అవకాశమిద్దాం. అప్పుడు ఉత్పల మాల రచన కూడా సులభతరమౌతుంది. ఏమంటారు?
----------------" భామకు మీసముల్ మొలిచె బాపురె! పూరుషుడూనె గర్భమున్ "-----------------
ఇదండి సమస్య.
ఇది ఉత్పల మాల వృత్త పాదం.
ఈ పాదం ఆ వృత్తంలో ఏ పాదంలో లైనా ప్రయోగించుతూ సమస్య ను విడగొట్టి పద్య పూరణ ద్వారా మన ప్రతిభను తేర్చి దిద్దుకుందామా మరి. ఐతే మీరు మీ పూరణకు ప్రయత్నించి పంప గలందులకు నే నాశిస్తున్నాను.
మన పూరణలను సరి చూసుకొని పిమ్మట పద్యం.నెట్ లో కూడా పాఠకుల విశ్లేషణార్థం ఉంచుదాం. ఏమంటారు?
జైహింద్.
యోజనానాం సహస్రే ... నుండి ... స్వభావో నోపదేశేవా - వరకు. మేలిమిబంగారం మన
సంస్కృతి.(552 - 724వ శ్లోకము)
-
552. శ్లో. యోజనానాం సహస్రే ద్వై ద్వైశతే ద్వై చ యోజనే
ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే. (సాయణా చార్యులు)
ఆ.వె. అర్థ నిమిషమందు నల రెండు వేలును
రెండు వంద...
1 రోజు క్రితం

వ్రాసినది
Labels:











